Mega brother Nagababu : మెగాస్టార్ తమ్ముడిగా అందరికీ సుపరిచితుడైనా సినిమాల్లో పెద్దగా కెరీర్ లేకపోయినా బుల్లితెర మీద జబర్దస్త్ కి జడ్జిగా మాత్రం మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నాగబాబు గారు దాదాపు జబర్దస్త్ పెట్టినప్పటి నుండి పదేళ్ళ పైగానే జడ్జిగా వ్యవహరించిన అక్కడ చిన్న చిన్న విబేధాల కారణంగా బయటికి వచ్చేసారు. ఆయన రావడంతో ఆయనతో పాటు చంద్ర, ఆర్పీ వంటి వారు బయటికి వచ్చేసారు. ఇక ఆ ఛానెల్ ఈ ఛానెల్ తిరిగి చివరకు మా టీవీ లో ఉన్న నాగబాబు గారు ఇటీవల యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాల మీద మాట్లాడారు.
ఆరంజ్ సినిమా వల్ల చాలా నష్టపోయాను…
నాగబాబు గారు తన సినిమా కెరీర్ గురించి మాట్లాడుతూ నటన ఏదో గాలివాటుగా చేసానే కానీ సీరియస్ గా తీసుకోలేదు. ఇక నిర్మాతగా కుడా నచ్చిన సినిమాను తీయాలనే తపనే కానీ డబ్బు సంపాదించాలి అని అల్లు అరవింద్, సురేష్ బాబు లాగా ఆలోచించలేదు. అలా ఉండుంటే నిర్మాతగా బాగా సంపాదించేవాడిని కానీ అలా చేయలేదు. ఇక ‘ఆరంజ్’ సినిమా సమయానికి సినిమా నిర్మాణం ఆపేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఆ సినిమా తరువాత మరో సినిమా నిర్మించకూడదని ముందే అనుకున్నాను. అయితే ఆరంజ్ సినిమాకు మరీ అంత నష్టాలు చూస్తానని మాత్రం ఊహించలేదు. సినిమా కోసం చాలా కోట్లు అప్పు చేసాను. సినిమా పోవడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాను.
ఆ సమయంలో కళ్యాణ్, అన్నయ్య నన్ను ఆదుకున్నారు. వాళ్లిద్దరూ లేకపోయింటే చనిపోయేవాడినేమో అలాంటి పరిస్థితి అది. నేను వాళ్ళను సహాయం అడుగలేదు కానీ చేసారు. కొన ఊపిరితో ఉన్న నాకు ప్రాణం పోశారు. ఆ పైన నా పోరాటం నాదే అలా జబర్దస్త్, ఇంకా కొన్ని సీరియల్స్ అంటూ చేసి నిబడ్డాను. నిజానికి జబర్దస్త్ మళ్ళీ నాకు కొత్త గుర్తింపు తెచ్చిపెట్టింది అంటూ ఆరంజ్ సినిమా అనుభవాలను పంచుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…