Senior Journalist Bhardwaja : 2029 ఎన్నికలు ముందు రాష్ట్రంలో సంచలనం రేపిన హత్య కేసు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. తను ఉన్న ఇంట్లోనే రాత్రి బాత్రూంలో శవమై కనిపించారు వివేకానంద రెడ్డి. ఈ హత్య మీద విచారణ తొలుత రాష్ట్ర పోలీసులు చేసిన కేసును తప్పుదోవ పట్టిస్తున్నారనే అనుమానంతో వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కోర్ట్ ను ఆశ్రయించి పక్క రాష్ట్రం అయిన తెలంగాణకు కేసును ట్రాన్సఫర్ చేయించుకున్నారు. జగన్ సొంత బాబాయ్ హత్య, చేతిలో అధికారం అయినా కేసులో ఒక్క అడుగు ముందుకు పడకపోవడం అందరినీ ఆశ్చర్యం కలిగించే అంశం. ఈ కేసు ఎన్ని రోజులుగా నత్తనడకన సాగుతున్నా ప్రస్తుతం ఒక ఫోన్ కాల్ లీక్ తో కొంత ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ విషయాల మీద సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఆయన పలు అంశాలను తెలిపారు.
అవినాష్ రెడ్డి ని విచారించునున్న సిబిఐ…
వైఎస్ వివేకానంద కేసు కొత్త మలుపులు తిరుగుతూనే ఉంది, నిజానికి నత్త నడకన సాగుతున్న ఈ కేసులో ఇప్పటి వరకు దోషుల ఊసు లేదు. ఇక ప్రస్తుతం కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేరు ఈ కేసులో వినిపిస్తోంది. హత్య తరువాత అవినాష్ రెడ్డి జగన్ సతీమణి భారతితో ఫోన్లో మాట్లాడినట్లు కాల్ డేటా ఉండటం అనుమానాలకు రేకేత్తిచ్చింది. భరద్వాజ గారు ఈ విషయం గురించి మాట్లాడుతూ జగన్ వైపు నుండి అవినాష్ రెడ్డి ఇక ఇటు వివేకానంద రెడ్డి కలిసి అంతకుముందు బెంగళూరులో ఒక సెటిల్మెంట్ చెయడం, అందులో వచ్చిన డబ్బును పంచుకోవడంలో తేడాలు రావడం వల్లే హత్య జరిగిందంటూ అభిప్రాయపడ్డారు. ఇక జగన్ మోహన్ రెడ్డి భార్య వైస్ భారతి సలహా మేరకు కడప ఎంపీ సీటు అవినాష్ కి ఇవ్వాలనుకోవడం కూడా వివేకానంద రెడ్డికి నచ్చలేదు.
పవర్ పాలిటిక్స్ వల్లే వివేకానంద రెడ్డి హత్య జరిగిందని, అయితే కావాలనే ఈ హత్య కేసులో జాప్యం జరిగిందని భరద్వాజ అభిప్రాయపడ్డారు. వైఎస్ వివేకానంద కూతురు సునీత కూడా తనకు ప్రాణహాని ఉందని తన సొంత వారిని నమ్మే స్థితి లేదంటూ చెప్పడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందంటూ చెప్పారు. ఇక ఈ కేసును సిబిఐ ద్వారా మోడీ ఉపయోగించుకుంటారంటూ భరద్వాజ అభిప్రాయపడ్డారు. జగన్ ను తమ కంట్రోల్ లో పెట్టుకోడానికి మోడీ ఈ కేసును వినియోగించుకుంటారంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…