మెగాస్టార్ చిరంజీవి తరవాత అయన ఫ్యామిలీనుంచి చాలామంది హీరోలుగా వచ్చారు.. వీరంతా చిరువేసిన బాటలోనే నడుస్తున్నారు. అంతేకాదు కొన్ని సినిమాలో చిరు ఫోటోలు, డైలాగులు, పాటలు మొదలగునవి వీరి సినిమాలో పెట్టుకుంటూ మెగాస్టార్ క్రేజ్ ను వాడుకుంటుంటారు. ఇక అసలు విషయానికి వస్తే..
చిరు పాటలను వాడుకోవడంలో ముందుండే హీరో అయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ మొదటి సినిమా “రేయ్” నుంచే చిరంజీవి పాటలను రీమిక్స్ చేయడం మొదలుపెట్టాడు. అప్పటినుంచి ఇప్పటి వరకు ధరమ్ తేజ్ చిరుకు సంబంధించిన నాలుగు పాటలు రీమక్స్ చేసాడు. అందులో రేయ్ లో “గోలీమార్”, సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ లో “గువ్వా గోరింకతో”, సుప్రీంలో “అందం హిందోళం”, ఇంటెలిజెంట్ లో “చమక్ చమక్ చాం” పాటలను రీమిక్స్ చేసాడు. ఈ పాటలలో గువ్వా గొరికంతో.. అందం హిందోళం.. పాటలు తప్పితే మిగిలిన పాటలకు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.
మరో పక్క మెగా అభిమానులు సైతం చిరు ఎవర్ గ్రీన్ పాటలను సాయి ధరమ్ తేజ్ పాడు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తేజ్ ఇకపై చిరు పాటలను రీమిక్స్ చేయకుండానే నిర్ణయించుకున్నాడట. మే 1 న “సోలో బ్రతుకే సో బెటరు” సినిమాతో ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు సాయి ధరమ్ తేజ్. మరి కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా అనేది సందేహంగా ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…