టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న చిరంజీవి దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వస్తోంది. అయితే ఒక వైపు సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే మరొకవైపు కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిరు పుట్టిన రోజున భోళాశంకర్ సినిమా ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. తమిళం వేదాళం సినిమాకు తెలుగు రీమేక్ గా బోళా శంకర్ సినిమా రాబోతోంది. అయితే ఈ బోళా శంకర్ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్స్ రాలేదు.
తాజాగా మెగా స్టార్ అభిమానులకు భోళాశంకర్ సినిమా నుంచి సర్ ప్రైజ్ ను ఇచ్చారు మూవీ మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చి రూమర్స్ కి చెక్ పెట్టేసారు.వచ్చే నెల నవంబర్ 11న ఉదయం 7:45 నిమిషాలకు ఈ సినిమా పూజ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు గా నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ తెలిపింది. అలాగే నవంబర్ 15 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది.
ఇక ఇందులో మెగాస్టార్ చిరంజీవి కి చెల్లెలుగా కీర్తి సురేష్ నటించనుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు వివరాలు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు మూవీ మేకర్స్. ఈ సినిమాకు మహతి సర్వ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలు కాజల్ హీరోయిన్ గా నటించిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే కీలక పాత్రలో నటిస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…