General News

దక్షిణాప్రికా నుంచి వచ్చిన 10 మంది ప్రయాణికులు మిస్సింగ్.. ఆందోళనలో కర్ణాటక ప్రజలు

కర్ణాటకలోని బెంగళూరులో దక్షిణాఫ్రికాకు చెందిన పది మంది విదేశీయులు అదృశ్యమైనట్లు ఆరోపణలు వచ్చాయి. బెంగళూరు మునిసిపల్ కార్పొరేషన్ , నగర ఆరోగ్య శాఖ అధికారులు తాము వాళ్ల జాడను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.భారతదేశంలో ఓమిక్రాన్ యొక్క మొదటి కేసు బెంగళూరులోనే కొనుగొనబడింది.

ఆ వ్యక్తి కూడా దక్షిణాప్రికా నుంచి వచ్చాడు. ఇలా 10 మంది దక్షిణాప్రికా నుంచి వచ్చిన వ్యక్తలు కనపడకపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ సందర్భంగా కర్ణాటక హెల్త్‌ మినిస్టర్‌ మాట్లాడుతూ.. ‘‘దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ వెలుగు చూసిన తర్వాత అక్కడ నుంచి 57 మంది బెంగళూరుకి వచ్చారు.

వీరిలో 10 మంది ఆచూకీ లభించడం లేదు. బీబీఎంపీ వారిని వెతికే పనిలో ఉందన్నారు. సదరు ప్రయాణికులు ఫోన్‌ నంబర్లు స్విచ్ఛాఫ్‌ వస్తున్నాయని తెలిపారు. వారు ఇచ్చిన అడ్రెస్‌కు వెళ్లి చూడగా.. అక్కడ ఎవరూ లేరు. వారిని వెతికి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని తెలిపారు. ఇక ఇప్పటికే కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని.. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. తప్పిపోయిన వారి కోసం గాలిస్తున్నామని .. వాళ్లను త్వరలోనే పట్టుకుంటామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

44 డిగ్రీలకు చేరే ఉష్ణోగ్రతలు.. మూడు రోజులు హెచ్చరిక

తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…

9 hours ago

ప్రభాస్ ‘ఫౌజీ’ ఛాన్స్ వదిలేసిన టాలీవుడ్ హీరో ఎవరు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…

9 hours ago

180 బాధితులు.. దేశాన్ని షాక్‌కు గురిచేసిన ఘటన

మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…

9 hours ago

వరుణ్ తేజ్ గాయం.. నిహారిక ఎమోషనల్ ప్రెస్ నోట్

టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…

10 hours ago

అటెండర్ మాస్టర్ ప్లాన్.. SBIకి రూ.2.65 కోట్ల షాక్!

తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…

12 hours ago

ఎన్నికల వేళ ఆస్తుల వివాదం.. ఉదయనిధిపై విచారణ

తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…

12 hours ago