Jonnalagadda Padmavathi: సింగనమల ఎమ్మెల్యే మిస్సింగ్.. సోషల్ మీడియాలో కలకలం రేపుతున్న పోస్టర్!
Jonnalagadda Padmavathi: అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి కనిపించడంలేదు అంటూ ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే గుంజేపల్లె గ్రామస్తులు ఇలా పోస్టర్ వేసి అతికించడంతో ఈ పోస్టర్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు జొన్నలగడ్డ పద్మావతి సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తున్నారు.ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి వచ్చిన ఈమె ఎన్నికలలో గెలిచిన తర్వాత ప్రజాసమస్యలు వినడానికి అందుబాటులో లేరు అయితే ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియడం లేదు తెలిసినవారు ఆచూకి తెలుపగలరు అంటూ గుంజే పల్లి గ్రామస్తులు ఈ పోస్టర్ ను అతికించారు.
ఈ క్రమంలోనే ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా తమ అభిమాన ఎమ్మెల్యే గురించి పోస్టర్ వేయడంతో ఎమ్మెల్యే అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఏమాత్రం స్పందించలేదు. మరి తన స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.
అయితే ఈ విధంగా ఎమ్మెల్యే కనపడటం లేదు మంత్రి కనపడటం లేదు అంటూ పోస్టర్లు వేయడం ఇది మొదటిసారి కాదు ఇదివరకే గతంలో ఎన్నో సార్లు మంత్రులు ఎమ్మెల్యేల పై పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదా ఇలా పోస్టర్లు వేస్తూ ప్రజలు వారి నిరసనను తెలియజేయడం ఎన్నోసార్లు చోటుచేసుకుంది.ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గురించి ఈ విధమైనటువంటి వార్తలు రావడంతో ఇది ఉద్దేశపూర్వకంగానే చేసిందని కొందరు వైసీపీ అభిమానులు వారి అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు. మరి ఈ విషయంపై ఎమ్మెల్యే ఏవిధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…