M M Sreelekha: ఎం ఎం శ్రీలేఖ పరిచయం అవసరం లేని పేరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింగర్ గా మ్యూజిక్ డైరెక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి శ్రీలేఖ కీరవాణి చెల్లెలు అన్న విషయం మనకు తెలిసిందే. ఇలా అన్నయ్య బాటలోనే సంగీత దర్శకురాలిగా ఈమె ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన పాతిక సంవత్సరాలలో దాదాపు ఐదు భాషలలో 80 సినిమాలకు సంగీతం అందించారు.
ఈ విధంగా ఎం ఎం శ్రీలేఖ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ నెల 17 నుంచి వరల్డ్ మ్యూజిక్ టూర్ ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 25 దేశాల్లో 25 మంది సింగర్లతో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలోనే ఈ వేడుకను పురస్కరించుకొని హైదరాబాద్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సినిమా సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ పాల్గొని శ్రీలేఖ గురించి పలు విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ శ్రీలేఖకు చిన్నప్పుడు నేను చూపించిన ఒక్క ఆశ వల్ల తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నేడు ఈ స్థాయిలో ఉందని తెలిపారు.ప్రస్తుతం తన అన్నయ్య కీరవాణి ఆస్కార్ రేసులో ఉన్నారు అలాగే శ్రీ లేక కూడా ఆస్కార్ వంటి గొప్ప అవార్డును అందుకోవాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ లేక కూడా మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి వచ్చి పాతిక సంవత్సరాలయింది. ఇలా పాతిక సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఇప్పటికి తనకు హైదరాబాద్ లోక సొంత ఇల్లు కూడా లేదని అద్దె ఇంట్లోనే ఉంటున్నానని ఈమె తెలిపారు.తాను గడిచిన పాతిక సంవత్సరాలలో పెద్దగా ఆస్తులు కూడుబెట్టుకోలేకపోయినా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాను అంటూ ఈ సందర్భంగా తనని ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…