Modi 3.0 : ఏపీకి ఐదు కేంద్ర మంత్రి పదవులు.. ఎవరెవరికంటే..

తంతే బూరెల బుట్టలో పడటమంటే ఇదేనేమో.. ఏపీలో ఏకకాలంలో ఒక పార్టీ పాతాళానికి.. మరో పార్టీ ఆకాశానికి ఎదగడం చూస్తున్నాం. వాస్తవానికి ఇలాంటి పరిస్థితిని ఎవరూ ఊహించి ఉండరు. కూటమి వర్సెస్ వైసీపీ హోరాహోరీ ఉంటుందనుకున్నారంతా కానీ ఫలితాలు చూస్తే వార్ పూర్తిగా వన్ సైడ్ అయిపోయింది. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. ఆ తరువాత కేంద్రంలోనూ టీడీపీ, జనసేనలు కీలకంగా మారాయి. ఏపీ కేంద్రాన్ని అడుక్కునే స్థాయి నుంచి శాసించే స్థాయికి వెళ్లిపోయింది. ఒక కేంద్ర పదవికే అంతకు ముందు దిక్కుండేది కాదు.. ఇప్పుడు ఏపీకి ఏకంగా ఐదు కేంద్ర పదవులు దక్కబోతున్నాయని టాక్. వీటిలో టీడీపీ నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరు.. జనసేన నుంచి ఒకరికి కేంద్ర పదవులు దక్కబోతున్నాయని సమాచారం. మొత్తానికి కేంద్రంలో ఏపీ చక్రం తిప్పబోతోంది. ఇది ఆనందించదగిన తరుణమే.

మిత్ర పక్షాలకు ఎన్ని పదవులు ఇవ్వాలి?

ఏపీలో గత ఐదేళ్లుగా అభివృద్ధి శూన్యం. ఏపీని గాడిన పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రోడ్ల నుంచి మొదలు పెడితే రాజధాని పునర్నిర్మాణం వంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు కేంద్రంలో కీలకంగా మారడం కూడా ఏపీకి ప్లస్ కానుంది. కొంత మేర ఇబ్బందుల నుంచి గట్టెక్కినట్టే. ఇక టీడీపీ నుంచి కేంద్ర పదవులు దక్కించుకునే వారిలో కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారని టాక్. జనసేన నుంచి బాలశౌరికి దక్కే ఛాన్స్ ఉంది. ఇక బీజేపీ నుంచి పురందేశ్వరికి అవకాశం లభించవచ్చని సమాచారం. ఈ మేరకు మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్న మోదీ మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తున్నారట. ఈ క్రమంలోనే శనివారం అర్ధరాత్రి వరకూ ఎన్డీఏ కూటమి మిత్రపక్షాలకు ఎన్ని పదవులు ఇవ్వాలి? వారికి ఏ ఏ శాఖలివ్వాలన్న దానిపై ఓ నిర్ణయానికి సైతం వచ్చేశారట.

కీలక శాఖలు బీజేపీకే..

ఇవాళ సాయంత్రం మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు మరికొందరు కేంద్ర మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే తనతో ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల జాబితాను ఇవాళ ఉదయమే మోదీ రాష్ట్రపతి భవన్‌కు పంపిస్తారట. ఆ వెంటనే ఆయా నేతలకు సైతం సమాచారం అందిస్తారట. కీలక శాఖలన్నింటినీ బీజేపీ తన వద్దనే పెట్టుకుంటుందట. రైల్వే, విద్య, జలశక్తి, విద్యుత్, వ్యవసాయం, గనులు వంటి శాఖలను కానీ సహాయ మంత్రి పదవులను కానీ మిత్రపక్షాలకు కేటాయిస్తుందట. ఈ సారి తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవి డౌటేనని అంటున్నారు. బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణలలో ఇద్దరికి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక పై ముగ్గురిలో కేంద్రంలో స్థానం దక్కని వారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందట. ఇక కిషన్ రెడ్డికి మాత్రం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago