Connect with us

Featured

Modi 3.0 : ఏపీకి ఐదు కేంద్ర మంత్రి పదవులు.. ఎవరెవరికంటే..

Published

on

తంతే బూరెల బుట్టలో పడటమంటే ఇదేనేమో.. ఏపీలో ఏకకాలంలో ఒక పార్టీ పాతాళానికి.. మరో పార్టీ ఆకాశానికి ఎదగడం చూస్తున్నాం. వాస్తవానికి ఇలాంటి పరిస్థితిని ఎవరూ ఊహించి ఉండరు. కూటమి వర్సెస్ వైసీపీ హోరాహోరీ ఉంటుందనుకున్నారంతా కానీ ఫలితాలు చూస్తే వార్ పూర్తిగా వన్ సైడ్ అయిపోయింది. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. ఆ తరువాత కేంద్రంలోనూ టీడీపీ, జనసేనలు కీలకంగా మారాయి. ఏపీ కేంద్రాన్ని అడుక్కునే స్థాయి నుంచి శాసించే స్థాయికి వెళ్లిపోయింది. ఒక కేంద్ర పదవికే అంతకు ముందు దిక్కుండేది కాదు.. ఇప్పుడు ఏపీకి ఏకంగా ఐదు కేంద్ర పదవులు దక్కబోతున్నాయని టాక్. వీటిలో టీడీపీ నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరు.. జనసేన నుంచి ఒకరికి కేంద్ర పదవులు దక్కబోతున్నాయని సమాచారం. మొత్తానికి కేంద్రంలో ఏపీ చక్రం తిప్పబోతోంది. ఇది ఆనందించదగిన తరుణమే.

మిత్ర పక్షాలకు ఎన్ని పదవులు ఇవ్వాలి?

ఏపీలో గత ఐదేళ్లుగా అభివృద్ధి శూన్యం. ఏపీని గాడిన పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రోడ్ల నుంచి మొదలు పెడితే రాజధాని పునర్నిర్మాణం వంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు కేంద్రంలో కీలకంగా మారడం కూడా ఏపీకి ప్లస్ కానుంది. కొంత మేర ఇబ్బందుల నుంచి గట్టెక్కినట్టే. ఇక టీడీపీ నుంచి కేంద్ర పదవులు దక్కించుకునే వారిలో కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారని టాక్. జనసేన నుంచి బాలశౌరికి దక్కే ఛాన్స్ ఉంది. ఇక బీజేపీ నుంచి పురందేశ్వరికి అవకాశం లభించవచ్చని సమాచారం. ఈ మేరకు మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్న మోదీ మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తున్నారట. ఈ క్రమంలోనే శనివారం అర్ధరాత్రి వరకూ ఎన్డీఏ కూటమి మిత్రపక్షాలకు ఎన్ని పదవులు ఇవ్వాలి? వారికి ఏ ఏ శాఖలివ్వాలన్న దానిపై ఓ నిర్ణయానికి సైతం వచ్చేశారట.

Advertisement

కీలక శాఖలు బీజేపీకే..

ఇవాళ సాయంత్రం మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు మరికొందరు కేంద్ర మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే తనతో ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల జాబితాను ఇవాళ ఉదయమే మోదీ రాష్ట్రపతి భవన్‌కు పంపిస్తారట. ఆ వెంటనే ఆయా నేతలకు సైతం సమాచారం అందిస్తారట. కీలక శాఖలన్నింటినీ బీజేపీ తన వద్దనే పెట్టుకుంటుందట. రైల్వే, విద్య, జలశక్తి, విద్యుత్, వ్యవసాయం, గనులు వంటి శాఖలను కానీ సహాయ మంత్రి పదవులను కానీ మిత్రపక్షాలకు కేటాయిస్తుందట. ఈ సారి తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవి డౌటేనని అంటున్నారు. బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణలలో ఇద్దరికి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక పై ముగ్గురిలో కేంద్రంలో స్థానం దక్కని వారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందట. ఇక కిషన్ రెడ్డికి మాత్రం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం.

Advertisement
Continue Reading
Advertisement

Featured

ITR FIling : గడువు పెంచలేదు.. ఫేక్ న్యూస్ నమ్మొద్దు.. “జూలై 31వ తేదీలోపు మీ ITR ఫైల్ చేయండి”.. కీలక ప్రకటన చేసిన ఐటీ శాఖ

Published

on

ITR ఫైలింగ్ : పన్ను చెల్లింపుదారులకు ముఖ్యమైన గమనిక. మీరు FY 2023-2024 కోసం మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఇంకా ఫైల్ చేయలేదా? ఆదాయపు పన్ను శాఖ మరో కీలక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 31లోగా ఐటీ రిటర్నులు సమర్పించాలని కోరింది ఐటీ శాఖ. మరో నెల రోజులు గడువు పెంపుపై వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలింది. పన్ను చెల్లింపుదారులు ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మవద్దని సోషల్ మీడియా ఎక్స్ లో సూచించింది.

గడువు 4 రోజులు మాత్రమే. జూలై 31వ తేదీలోపు ITR ఫైల్ చేయాలి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ వీలైనంత త్వరగా రిటర్నులు సమర్పించాలని ఐటీ శాఖ సూచించింది. పన్ను పోర్టల్ లో ఎటువంటి సాంకేతిక సమస్య లేదు. మీరు గడువు సమయంలోపు ITR ఫైల్ చేయకపోతే, మీరు సెక్షన్ 234A కింద వడ్డీని మరియు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 234F కింద జరిమానా చెల్లించవలసి ఉంటుంది.

మరోవైపు ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసి వాపసు కోరుతున్న వారిని కూడా ఐటీ శాఖ హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ఫోన్లలో మెసేజ్ లు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసిందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఇలాంటి ఫేక్ మెసేజ్‌లను చూసి మోసపోకండి మరియు రీఫండ్ కోసం మీ బ్యాంక్ ఖాతా వివరాలు మరియు వన్-టైమ్ పాస్‌వర్డ్‌లను అడుగుతూ మీకు కాల్ వస్తే అప్రమత్తంగా ఉండండి. అటువంటి లింక్‌లపై క్లిక్ చేయవద్దు. ఇప్పటి వరకు 5 కోట్ల మంది పన్ను రిటర్నులు దాఖలు చేసినట్లు గుర్తించింది. వీరిలో ఇప్పటికే 1.8 మిలియన్ల రిటర్న్‌లు ప్రాసెస్ చేయబడి, రీఫండ్ ఖాతాలకు జమ అయినట్లు కూడా తెలిపింది.

Advertisement

Continue Reading

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!