Janasena: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు సంచలంగానే ఉంటాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా కూటమి అత్యధిక మెజారిటీ సొంతం చేసుకుని అధికారం చేపట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ కూటమిలో భాగంగా జనసేన పార్టీ కూడా భాగమైన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఇన్ని సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు అంటూ ఒకప్పుడు ఆయనపై ఉన్న విమర్శలు కూడా వచ్చాయి.

ఇలా పవన్ కళ్యాణ్ గురించి ఎన్నో విమర్శలు వచ్చిన ఆయన వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ముందడుగు వేస్తూ నేడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఈయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించారు. ఇక జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా పలు దిశా నిర్దేశాలు చేస్తూ ఉంటారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో మంచి స్థాయిలో ఉండే దీంతో ఎంతోమంది ఇతర పార్టీ నాయకులు కూడా జనసేన పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. కేవలం రాజకీయ నేతలు మాత్రమే కాకుండా కార్యకర్తలు సైతం జనసేన కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు.
కేసులు పెట్టనివారు..
ఇలా జనసేన పార్టీలోకి రావడానికి ప్రయత్నిస్తున్న వారికి నాగబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే కొన్ని కండిషన్లను కూడా పెట్టారు. జనసేన పరివారాన్ని ఇబ్బందులకు గురి చేయని.. కేసులు పెట్టని వారికి మాత్రమే జనసేన కండువా కప్పుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారని ఇటీవల నాగబాబు కూడా ఈ విషయంపై మాట్లాడుతూ స్పష్టత ఇచ్చారు.

































