Sai Sreenivas: సినీ ఇండస్ట్రీలో నిర్మాతలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో బెల్లంకొండ ఫ్యామిలీ కూడా ఒకటి. బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈయన వారసులుగా ఇండస్ట్రీలోకి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.

అల్లుడు శీను అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన సాయి శ్రీనివాస్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ కోసం ఎంతో కష్టపడుతున్నారు. అయితే ఈయన తన మొదటి సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తి కావడంతో సోషల్ మీడియా వేదికగా తనని ఇన్ని సంవత్సరాలు పాటు ఆదరించిన అభిమానులకు ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇలా ఈయన ఇండస్ట్రీలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తి కావడంతో సోషల్ మీడియా వేదికగా పలు ఆసక్తికరమైన ఫోటోలను షేర్ చేశారు. ఇందులో భాగంగా తన ఇండస్ట్రీ కెరియర్ పది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అందుల పాఠశాలకు వెళ్లివారికి భోజన సదుపాయాన్ని కల్పించడమే కాకుండా వారికి దుస్తులను కూడా పంపిణీ చేశారు.
అంద విద్యార్థులకు అండగా..
ఇలా అంద విద్యార్థుల కోసం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేసిన ఈ మంచి పనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ ఈయన మంచి మనసుకు ఫిదా అవుతున్నారు. ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలను పూర్తి చేసుకున్న ఎవరు కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు మీరు గ్రేట్ అంటూ కామెంట్లో చేస్తున్నారు.


































