Pawan Kalyan: జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల విషయంలో తరచూ వార్తలలో నిలుస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకోవడంతో పలువురు ఈయన పెళ్లిళ్ల గురించి విమర్శలు చేస్తూ వచ్చారు. ఇక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నో సందర్భాలలో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి బహిరంగ సభలలో కూడా మాట్లాడిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న హింసల గురించి పలు విషయాలు వెల్లడించారు 2019 నుంచి 24 వరకు గత ప్రభుత్వం రాష్ట్రంలో హింసలను ప్రోత్సహించింది అని తెలిపారు.
నేను పుట్టినప్పటినుంచి నాపై ఇప్పటివరకు ఒక్క కేసు కూడా లేదు కానీ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏకంగా నాపై 17 కేసులు అలాగే పవన్ కళ్యాణ్ పై ఏడు కేసులు పెట్టారని చంద్రబాబు నాయుడు తెలిపారు. నాపై పెట్టిన కేసులు కారణంగా పవన్ కళ్యాణ్ రోడ్డుపై పడుకుని నిరసన తెలిపే పరిస్థితికి తీసుకువచ్చారని తెలిపారు.
చట్టబద్ధంగా చేశారు..
ఇక అసెంబ్లీ సమావేశాలలో భాగంగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏం చేసినా అది చట్టబద్ధంగానే చేశారు. నువ్వు (జగన్) కూడా తెగ కలవరిస్తున్నావ్ కావాలంటే పోయి కాపురం చెయ్యవయ్యా అన్నా నేను కూడా అని గుర్తు చేశారు చంద్రబాబు. వ్యక్తి గతంగా తీసుకురావద్దని చంద్రబాబు ఈ సందర్భంగా వెల్లడించారు. ఇలా మహిళలను ఉద్దేశిస్తూ అసభ్యకరమైన మాటలు మాట్లాడితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామంటూ చంద్రబాబు హెచ్చరించారు.


































