కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల భారతదేశంలోని ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దేశంలో కరోనా వల్ల కోట్ల సంఖ్యలో ఉద్యోగాలు ఉద్యోగాలను కోల్పోయారు. కొందరు అప్పులపై ఆధారపడి జీవనం సాగిస్తుంటే మరికొందరు ఒక పూట తిని మరో పూట తినకుండా జీవనం సాగిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరేలా చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
దీంతో కొందరు కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతాలలో నగదు జమ చేయబోతుందంటూ సోషల్ మీడియాలో ఫేక్ వార్తలను విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రధాన మంత్రి మాన్ధన్ యోజన అకౌంట్లు ఉన్నవారికి కేంద్రం నగదు జమ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. కేంద్రం నిజంగా నగదు జమ చేస్తుందేమోనని భావించి కొందరు ఆ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.
ఒక్కొక్కరికి కేంద్రం 3,000 రూపాయలు ఇవ్వబోతుందని.. అకౌంట్లు కలిగిన దేశంలోని ప్రజలందరికీ ప్రయోజనం కలగబోతుందని కేంద్రం చెప్పినట్టు ఆ వీడియోలో పేర్కొన్నారు. అయితే విపరీతంగా ఈ వార్త వైరల్ అవుతున్న నేపథ్యంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ వార్త గురించి స్పందించి వివరణ ఇచ్చింది. కేంద్రం నుంచి ఇలాంటి ప్రకటన వెలువడలేదని పీఐబీ స్పష్టం చేసింది.
వైరల్ అవుతున్న వార్తను ప్రజలు నమ్మవద్దని సూచనలు చేసింది. వైరల్ అవుతున్న వార్త నకిలీ వార్త అని.. కేంద్రం ఏదైనా కొత్త స్కీమ్ ను తెస్తే అధికారికంగా ప్రకటన వెలువడుతుందని.. వైరల్ అవుతున్న ఫేక్ వార్తలను నమ్మి మోసపోవద్దని సూచనలు చేసింది. ఇతరులకు వార్తలను షేర్ చేసేముందు ఆ వార్తల్లో నిజానిజాలను నిర్ధారించుకోవాలని పేర్కొంది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కీలక మార్పుల దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటివరకు…
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…