కరోనా వైరస్ విజృంభణ, లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దేశంలో ప్రజల కొనుగోలు శక్తి భారీగా తగ్గింది. ప్రజలు నగదును పొదుపు చేయడానికే తప్ప ఖర్చు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ఇలాంటి సమయంలో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సొంతింటి కల సాకారం చేసుకోవాలనుకునే వాళ్లకు శుభవార్త చెప్పింది.
ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కోసం కేంద్రం 18,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ స్కీమ్ ద్వారా కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్లకు కేంద్రం పన్ను మినహాయింపు ప్రయోజనాలను కల్పిస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు కోట్ల రూపాయల లోపు రెసిడెన్షియల్ యూనిట్లు పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందవచ్చని తెలిపారు.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 56(2) ఎక్స్ ద్వారా కేంద్రం ఇంటి కొనుగోలుదారులకు ప్రయోజనం కల్పించనుంది. సర్కిల్ రేటుకు అగ్రిమెంట్ వ్యాల్యూకు మధ్య గతంలో వ్యత్యాసం 10 శాతంగా ఉండగా కేంద్రం ప్రస్తుతం ఆ వ్యత్యాసాన్ని 20 శాతానికి పెంచింది. నిర్మలా సీతారామన్ రైతులకు 65,000 కోట్ల రూపాయల ఫర్టిలైజర్ సబ్సిడీ, కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి 900 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలిపారు.
పీఎం గరీబ్ కల్యాణ్ రోజ్గర్ యోజన స్కీమ్ కు 10,000 కోట్ల రూపాయలు mgnregs స్కీమ్ కు 10,000 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తలిపారు. కరోనా, లాక్ డౌన్ వల్ల నష్టపోయిన వాళ్లందరికీ ప్రయోజనం చేకూరే విధంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…