కరోనా వైరస్ విజృంభణ, లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దేశంలో ప్రజల కొనుగోలు శక్తి భారీగా తగ్గింది. ప్రజలు నగదును పొదుపు చేయడానికే తప్ప ఖర్చు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ఇలాంటి సమయంలో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సొంతింటి కల సాకారం చేసుకోవాలనుకునే వాళ్లకు శుభవార్త చెప్పింది.
ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కోసం కేంద్రం 18,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ స్కీమ్ ద్వారా కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్లకు కేంద్రం పన్ను మినహాయింపు ప్రయోజనాలను కల్పిస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు కోట్ల రూపాయల లోపు రెసిడెన్షియల్ యూనిట్లు పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందవచ్చని తెలిపారు.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 56(2) ఎక్స్ ద్వారా కేంద్రం ఇంటి కొనుగోలుదారులకు ప్రయోజనం కల్పించనుంది. సర్కిల్ రేటుకు అగ్రిమెంట్ వ్యాల్యూకు మధ్య గతంలో వ్యత్యాసం 10 శాతంగా ఉండగా కేంద్రం ప్రస్తుతం ఆ వ్యత్యాసాన్ని 20 శాతానికి పెంచింది. నిర్మలా సీతారామన్ రైతులకు 65,000 కోట్ల రూపాయల ఫర్టిలైజర్ సబ్సిడీ, కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి 900 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలిపారు.
పీఎం గరీబ్ కల్యాణ్ రోజ్గర్ యోజన స్కీమ్ కు 10,000 కోట్ల రూపాయలు mgnregs స్కీమ్ కు 10,000 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తలిపారు. కరోనా, లాక్ డౌన్ వల్ల నష్టపోయిన వాళ్లందరికీ ప్రయోజనం చేకూరే విధంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…