కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆదాయం పెంచాలనే ఉద్దేశంతో ఇప్పటికే అందుబాటులో ఉన్న స్కీమ్ లతో పాటు కొత్త స్కీమ్ లను అమలు చేస్తూ రైతులను ప్రోత్సహిస్తోంది. పాడి రైతులకు ప్రయోజనం చేకూరేలా రాష్ట్రీయ కామధేను ఆయోగ్ ఒక కొత్త కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. గోశాల నిర్వాహకులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దీపావళి పండుగకు పేడలో ప్రమిదలు తయారు చేసే కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తోంది.
గోమయ దియా పేరుతో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా 11 కోట్ల ప్రమిదలు తయారు చేయించి గోశాల నిర్వాహకులను ప్రోత్సహించాలని భావిస్తోంది. దేశంలోని గోశాల నిర్వాహకులు గోవు పేడతో తయారు చేసిన ప్రమిదలు తయారు చేయాల్సి ఉంటుంది. కేంద్రం ఇలాంటి పథకాన్నిఅమలు చేయడం ఇదే మొదటిసారి. రాష్ట్రీయ కామధేను ఆయోగ్ గోసంతతి వృద్ధితో పాటు గోశాల నిర్వాహకులకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది.
రోజురోజుకు ఆవు పేడ ప్రమిదలకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. పాత తరంలో చేతులతో ప్రమిదలు తయారు చేయగా అయితే మెషిన్ తో సులభంగా ప్రమిదలను తయారు చేయడం సాధ్యమవుతుంది. సులభంగా డబ్బులను సంపాదించుకునే అవకాశం ఉంటుంది. రైతులకు ఈ విధంగా లక్షల రూపాయల ఆదాయం లభిస్తుంది. డైరీ ఫాం ఉన్నవాళ్లు కూడా ఆవు పేడతో సులభంగా ప్రమిదలను తయారు చేయవచ్చు.
ప్రమిదలు తయారు చేయాలంటే ఎర్ర మట్టి, బియ్యం పిండి, ఆవు పేడ అవసరం. వీటన్నింటినీ మిక్స్ చేసి మిషన్ లో వేస్తే ప్రమిదలు సిద్ధమవుతాయి. ప్రమిదలను ఎండబెట్టి మార్కెట్ లో విక్రయించి కూడా ఆదాయం పొందవచ్చు. మార్కెటింగ్ చేసుకుంటే మరింత ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…