Mr Tea Navin Reddy Vaishali Issue : రంగారెడ్డి జిల్లా అధిభట్లలో జరిగిన ఒక కిడ్నాప్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమా లెవెల్లో వందమంది తో వచ్చి ఒక అమ్మాయిని ఎత్తుకెళ్లారు. అడ్డొచ్చిన వారిని కొట్టి ఆ ఇంటివద్ద సీసీ కెమెరాలను ధ్వంసం చేసి నానా హంగామా చేసి యువతీని కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. కానీ ఈ కిడ్నాప్ విషయంలో లోతుకి వెళితే అక్కడే మరిన్ని ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. ఇక కిడ్నాప్ చేయించిన నవీన్ రెడ్డి బ్యాక్ గ్రౌండ్ చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు. దౌర్జన్యంగా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసారని తోలుత భావించినా నిజానికి ఆ అమ్మాయికి నవీన్ రెడ్డి కి అంతకుముందు చాలానే జరిగిందని లేటుగా బయటికి వచ్చింది. సినిమా ను తలపిస్తున్న ఈ స్టోరీ లో నవీన్ రెడ్డి నేపధ్యం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
చిన్న వయసులో వేలకోట్ల వ్యాపారం…..
నవీన్ రెడ్డి సిఏ చేసి ఆపై సొంతంగా వ్యాపారం ప్రారంభించాడు. మొదట ఒక టీ షాప్ తో మొదలయిన వ్యాపారం నేడు దేశవ్యాప్తంగా 400 ఫ్రాంచైజిలతో కోట్ల టర్న్ఓవర్ బిజినెస్ తో ఉన్నాడు ఇరవై తొమ్మిదేల్ల వయసులోనే కోట్ల బిజినెస్ టర్న్ ఓవర్ ఆది స్వశక్తి తో ఎదిగిన నవీన్ రెడ్డి లాక్ డౌన్ టైములో బెంగళూరు లో వైశాలి పరిచయమైంది. డెంటల్ డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్న వైశాలి బ్యాడ్ మింటన్ ట్రైనింగ్ కోసం వచ్చి అక్కడ నవీన్ రెడ్డి పరిచయం అవడం ఇద్దరు స్నేహితులవడం చక చకా జరిగిపోయింది. ఆ ఇక ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం తో వైశాలి తండ్రి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ దామోదర్ రెడ్డి కూడా మొదట వీరికి పెళ్లి చేయాలని అనుకున్నారు. ఇక పెద్దలు అంగీకరించడం వల్ల వీరిద్దరు ట్రిపులకు వెళ్లడం రెగ్యులర్ గా కలవడం చేసేవారు.
అయితే కొద్దికాలానికి ఏమైందో కానీ వైశాలి పేరెంట్స్ నవీన్ తో పెళ్లి వద్దని చెప్పేసారు. వైశాలిని కూడా ఒప్పించి వేరే పెళ్ళికి సిద్ధం చేసారు. అయితే వైశాలి సడన్ టర్న్ తీసుకోవడం నవీన్ ఆమెను మళ్ళీ కన్విన్స్ చేయడానికి ఆమె ఇంటి ఎదురుగా స్థలం లీజుకి తీసుకుని అక్కడ రెస్టారెంట్ పెట్టి రోజు ఆమెను చూసుకునేవాడు. ఇక వైశాలి పేరెంట్స్ నవీన్ మీద పోలీసులకు కూతురుతో కంప్లైంట్ కూడా చేయించారు. ఇప్పుడు పెళ్లి చేయాలని నిశ్చితార్థం ఫిక్స్ చెయడంతో నవీన్ 100 మందితో వచ్చి వైశాలిని తన ఇంటినుండి ఎత్తుకెళ్లాడు. అయితే ఆమె ఏడ్చడం తో తండ్రితో ఫోన్ మాట్లాడించాడు నవీన్. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు వైశాలి ని కనుగోన్నారు. దీంతో కిడ్నాప్ కథ సుఖాంతం అయింది .
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…