Mudragada : మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం రెడ్డి గారు తాజాగా ఒక లేఖ విడుదల చేశారు. అందులో తన కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలను ఆయన పంచుకున్నారు. ఆ లేఖలో ఆయన ఏం చెప్పారంటే..
“ఈ మధ్య మా కుటుంబం మీద ఒక కుటుంబం దాడి చేస్తోంది. నిజానికి వాళ్ళతో మాకు చాలా ఏళ్ల కిందటే మనస్పర్థలు వచ్చాయి. దాదాపు ఒక సంవత్సరం నుండి వాళ్ళతో మాకు ఎలాంటి సంబంధాలు లేవు. నేను వాళ్ళ జోలికి వెళ్లకపోయినా, వాళ్ళు మాత్రం మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ.. “మా చిన్న కొడుకు గిరిబాబు ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు. అందుకే ఇలాంటి పనులు చేస్తున్నారు” అని అన్నారు.
“నాకు కాన్సర్ వచ్చిందని, నన్ను ఇంట్లో బంధించారని, నా కొడుకు, వాళ్ళ మామ నన్ను పట్టించుకోవడం లేదని ఎన్నో అబద్ధాలు చెబుతున్నారు. కానీ నిజం ఏంటంటే, నేను ఈరోజు ఆరోగ్యంగా ఉన్నానంటే దానికి కారణం నా చిన్న కొడుకు గిరిబాబే. అతను నాకు అన్నీ తానై చూసుకుంటున్నాడు” అని ఆయన కొడుకు మీద ప్రేమను కురిపించారు.
అంతేకాదు, వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడటానికి ఒక కారణం ఉందని ఆయన అన్నారు. “నా కొడుకుని నాకు దూరం చేస్తే, నేను వాళ్ళ ఇంటికి వస్తానని, వాళ్ళ చెప్పుచేతుల్లో ఉంటానని అనుకుంటున్నారేమో. కానీ అది ఈ జన్మలో కాదు, ఎన్ని జన్మలెత్తినా జరగదు” అని ఆయన కుండబద్దలు కొట్టారు.
గతంలో తన భార్యకు ఆరోగ్యం బాగాలేనప్పుడు హైదరాబాద్లోని హాస్పిటల్లో ఆపరేషన్ చేయించామని, ఆ తర్వాత 15 రోజులకు డిశ్చార్జ్ అయ్యాక విశ్రాంతి కోసం వాళ్ళింటికి వెళ్తే, వాళ్ళు బయటికి గెంటేశారని ఆయన గుర్తు చేశారు. “నాకు వయసు మీద పడటం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు తప్ప వేరే ఏమీ లేవు. నేను ప్రతిరోజు నా ఇంటికి వచ్చే అభిమానులతో సంతోషంగా గడుపుతున్నాను. నన్ను బంధించాలనో, మానసికంగా బాధించాలనో ఎవరైనా ప్రయత్నిస్తే అది వారి వల్ల కాదు” అని ఆయన తేల్చి చెప్పారు.
చివరగా ఆయన రాజకీయంగా కూడా స్పందించారు. “మీకు దమ్ముంటే కాపు రిజర్వేషన్, ఎన్నికలలో ఇచ్చిన హామీలు, సూపర్ సిక్స్ స్కీమ్లను అమలు చేయించిన తర్వాత మీ గొప్పలు చెప్పుకోండి” అని ఆయన సవాల్ విసిరారు.
సినీ తారల వ్యక్తిగత జీవితంపై ప్రేక్షకులకు ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. వారి రోజువారీ అలవాట్లు, కుటుంబ సంబంధాలు, ఇంటి…
డిజిటల్ యుగంలో ఫోక్ సాంగ్స్కు పెరుగుతున్న ఆదరణతో పాటు, కొత్త టాలెంట్కు కూడా విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ఈ ట్రెండ్లోనే…
సినీ పరిశ్రమలో ప్రతిభ ఒక్కటే సరిపోదు.. అదృష్టం కూడా తోడైతేనే కెరీర్ సాఫీగా సాగుతుంది. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమా టాలీవుడ్లో మైలురాయిగా నిలిచిన…
ప్రసిద్ధ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినిమా ప్రయాణం, అలాగే ప్రముఖ నటుడు జూనియర్…
హైదరాబాద్ నుంచి హుబ్లీకి బయల్దేరిన ఫ్లై91 ఎయిర్లైన్స్కు చెందిన విమానం అనూహ్య పరిస్థితుల్లో నాలుగు గంటల పాటు గాల్లోనే తిరుగుతూ…