Mumbai Drugs Case : బాలీవుడ్ సినిమా వాళ్లకు డ్రగ్స్ కు మంచి బంధం ఉంది. అపుడు ఏదో ఒక సందర్భంలో డ్రగ్స్ కేసుల్లో సెలబ్రిటీలు దొరుకుతూనే ఉంటారు. ఇక ఈ డ్రగ్స్ మాఫియా టాలీవుడ్ లోనూ కలకలం రేపటం చూసాం.ఇక ఇటీవల బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో దొరికాడు.
ఈ వార్త బాగానే వైరల్ అయింది అప్పట్లో ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పుడోకా షాకింగ్ విషయం వైరల్ అవుతోంది. ముంబై క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ పార్టీ పై దాడులలో ఆర్యన్ ఖాన్ పలువురు సెలబ్రిటీలు దొరికారు.
కీలక సాక్షి మృతి….
ఇక ఈ డ్రగ్స్ బాగోతం బయటపడటంతో ఈ కేసులో ప్రభాకర్ సెయిల్ ను ఎన్సీబీ సాక్షిగా పేర్కొంది. దీంతో అకస్మాత్తుగా శుక్రవారం తన నివాసంలో సెయిల్ మృతి చెందాడు. డ్రగ్ కేసులో మరో సాక్షి అయిన కేపి గోసావి వ్యక్తిగత సెక్యూరిటీ గార్డుగా సెయిల్ పనిచేస్తున్నాడు. అయితే శుక్రవారం ముంబై పరిధిలోని చెంబూర్లోని మహుల్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్న సెయిల్ గుండెపోటుకు గురైనట్లు సెయిల్ తరపు న్యాయవాది ధృవీకరించారు.
అంత్యక్రియలు…
గ్రామం నుండి సోదరులు, బంధువులు ముంబై వచ్చాక దహన సంస్కారాలు చేస్తారు. ప్రభాకర్ సెయిల్ కు తల్లి,భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మరణంపై వారికి ఎటువంటి అనుమానం లేదని ప్రభాకర్ తరపు న్యాయవాది తెలిపారు.ఇపుడు ఈ ఉదంతం కేసును ఆ మలుపు తిప్పుతుందో అనీ చర్చ జరుగుతోంది.ఇక గత ఏడాది అక్టోబర్ లో ముంబై లో చోటు చేసుకున్న ఈ డ్రగ్స్ కేసు లో 8మందిని అరెస్ట్ చేసారు. NCB అధికారులు దాడి చేసి డ్రగ్స్ తో పాటు భారీగా నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు.
సినీ తారల వ్యక్తిగత జీవితంపై ప్రేక్షకులకు ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. వారి రోజువారీ అలవాట్లు, కుటుంబ సంబంధాలు, ఇంటి…
డిజిటల్ యుగంలో ఫోక్ సాంగ్స్కు పెరుగుతున్న ఆదరణతో పాటు, కొత్త టాలెంట్కు కూడా విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ఈ ట్రెండ్లోనే…
సినీ పరిశ్రమలో ప్రతిభ ఒక్కటే సరిపోదు.. అదృష్టం కూడా తోడైతేనే కెరీర్ సాఫీగా సాగుతుంది. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమా టాలీవుడ్లో మైలురాయిగా నిలిచిన…
ప్రసిద్ధ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినిమా ప్రయాణం, అలాగే ప్రముఖ నటుడు జూనియర్…
హైదరాబాద్ నుంచి హుబ్లీకి బయల్దేరిన ఫ్లై91 ఎయిర్లైన్స్కు చెందిన విమానం అనూహ్య పరిస్థితుల్లో నాలుగు గంటల పాటు గాల్లోనే తిరుగుతూ…