దేశవ్యాప్తంగా కరోనా ఉదృతి పెరుగుతోంది.ఈ క్రమంలోనే మహారాష్ట్రలో ఎక్కువగా కేసులు నమోదు కావడంతో మహారాష్ట్రలో లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ కారణంగా యువకుడు తన ప్రియురాలిని ఎంతో మిస్ అవుతున్నానని, ఎలాగైనా తనని కలవాలని భావించాడు.ఈ క్రమంలోనే ఆ యువకుడు పోలీసులను ఓ విచిత్రమైన ప్రశ్న అడుగుతూ ముంబై పోలీసులకు ట్వీట్ చేశాడు.
లాక్ డౌన్ కారణంగా తన ప్రియురాలిని మిస్ అవుతున్నాను. తనని కలవడానికి బయటకు వెళ్లాలనుకుంటున్నాను. దీనికోసం బండిపై ఏ రంగు స్టిక్కర్ వాడాలి అంటూ ఆ యువకుడు ముంబై పోలీసులకు ట్యాగ్ చేశాడు.దీంతో ముంబై పోలీసులు కూడా ఎంతో సమయస్ఫూర్తితో ఆ యువకుడికి దిమ్మతిరిగే సమాధానం చెప్పారు.
ఈ పని మీకు చాలా ముఖ్యమైనదని మేము అర్థం చేసుకోగలం అంటూ టీజ్ చేస్తూనే… ఈ ప్రశ్న మా నిత్యవసర లేదా అత్యవసర జాబితాలో లేదని రిప్లై ఇవ్వడంతో పాటు..”దూరం బంధాలను ఎంతో బలపరుస్తాయి. ఇది చిన్న అడ్డం మాత్రమే త్వరలోనే ఈ అడ్డం ముగుస్తుంది. మీరు జీవితాంతం కలిసి ఉండాలని ఆశిస్తున్నాం” అంటూ ముంబై పోలీసులు ఆ ప్రేమికుడు అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని రీట్వీట్ చేశారు.ఈ విధంగా ముంబై పోలీసులు ఆ యువకుడికి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మందిని ఆకట్టుకుంది. ఈ విధంగా పోలీసులు చెప్పిన సమాధానం చూసిన నెటిజన్లు పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…