Featured

Murali Mohan : అతడు సినిమా మధ్యలో ఆపేయడానికి కారణం అదే… సంపాదించిన డబ్బాంత ఆ సినిమాతో పోగొట్టుకున్నాను…: నటుడు మురళీ మోహన్

Murali Mohan : వ్యాపారం నుండి నటన మీద ఆసక్తితో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మురళీమోహన్ గారు జగమే మాయ సినిమాతో పరిచయమై అనతి కాలంలోనే హీరోగా అనేక చిత్రల్లో నటించారు. ఇండస్ట్రీ లో హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన అటు పాలిటిక్స్ లోకి వచ్చి అక్కడ తనదైన ముద్ర వేశారు. ఇక సినిమా నిర్మాణం లో అడుగుపెట్టి జయభేరి బ్యానర్ స్థాపించి పలు చిత్రలను నిర్మించిన ఆయన ఈ మద్య కాలంలో సినిమాలను తగ్గించి పలు ఇంటర్వ్యూ ల్లో పాల్గొంటు సినిమా రంగంలోని అనేక విషయాల గురించి మాట్లాడుతున్నారు.

ఆ సినిమా వల్ల నష్టపోయాను… అతడు సినిమా విషయంలో జరిగింది అదే…..

జయభేరి చిత్ర నిర్మాణ సంస్థ మొదట గిరిబాబు గారి పేరు మీద ఉండగా ఆయన బ్యానర్ తీసేయాలని అనుకుంటున్న సమయంలో మురళి మోహన్ గారు అ ఆపేరును తీసుకుని ప్రొడక్షన్ హౌస్ పెట్టి సినిమాలను నిర్మించారు. ఆయన బ్యానర్ లో వచ్చిన సినిమాల్లో చాలా వరకు హిట్ సినిమాలే ఉన్నాయంటు తెలిపిన మురళి మోహన్ గారు అప్పటి వరకు సంపాదించిన డబ్బాంత కోల్పోయింది మాత్రం మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన తమిళ సినిమా ఇరువర్ సినిమాతో. ఇద్దరుగా ఆ సినిమాను తెలుగులో తీసుకువస్తే భారీ నష్టాలను మిగిలిచ్చింది అంటూ తెలిపారు.

ఇక అలాంటి నష్టం ఇంక ఏ సినిమాలోనూ రాలేదంటూ వివరించారు. ఇక మహేష్ బాబు హీరోగా అతడు సినిమాను త్రివిక్రమ్ డైరెక్షన్ లో నిర్మించిన సమయంలో మొదట అనుకున్న బడ్జెట్ మించి సినిమా ధాటి పోవడం, అనుకున్న సమయానికి అప్పటి వరకు సినిమాను విడుదల చేసాం కానీ ఆ సినిమా విషయంలో బాగా ఆలస్యమైంది అంటూ అవే సమస్యలు తప్ప సినిమా నిర్మాణం మధ్యలో ఆపలేదు అంటూ తెలిపారు. సినిమా నిర్మాణ వ్యవహారాలన్ని మురళి మోహన్ గారి తమ్ముడు కిషోర్ గారే చూసుకుంటారు.

Bhargavi

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

2 hours ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

2 hours ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

2 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

3 hours ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

3 hours ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

3 hours ago