టాలీవుడ్ కన్నడ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా నిలిచింది. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ బ్యూటీ బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంది. ఇండియన్ క్రష్ గానే కాకుండా మోస్ట్ డిజైరబుల్ హీరోయిన్ గా కూడా నిలిచింది. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
ఇదిలా ఉంటే నిన్న ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఓ మీడియాతో ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక మందన.. తాను తెలుగులో సినిమాలు అవకాశాలు రావడంతో భయపడుతున్న సమయంలో తన తండ్రి మదన్ ధైర్యం చెప్పి టాలీవుడ్ కు పంపించాడట. ఈ రోజు తాను టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నిలవడం, ఇంత అభిమానం అందుకోవడంకు కారణం తన తండ్రే అని తెలిపింది.
ఇక ఆయన వ్యాపారం విషయంలో ఎప్పుడు బిజీగా ఉండేవారట. ఇక తను కూడా చాలావరకు హాస్టల్లో ఉండి చదువుకున్నాదట. అలా తన తండ్రి తో చిన్నతనంలోని అంతగా అనుబంధం ఉండేది కాదని తెలిపింది. పైగా తన తండ్రితో ఎక్కువగా గడపలేకపోయిందట. అలా తన తండ్రి ప్రేమలో సందేహాలు ఎదురయ్యాయని తెలిపింది.
కానీ తాను పెద్దయ్యాక తన తండ్రి ప్రేమ ఎంత గొప్పదో అర్థమైందని తెలిపింది. ఆయన పని విషయంలో ఎంత బిజీగా ఉన్నా తనకు ప్రతి విషయంలో అండగా ఉండేవారని తెలిపింది. ఇక తను కన్నడ సినిమాలో తొలిసారి అడుగు పెడుతున్న సమయంలో డైరెక్టర్ వెంకీ కుడుముల తనను ఛలో సినిమా తో టాలీవుడ్ కు పరిచయం చేయాలని అనుకున్నారట. కానీ టాలీవుడ్ పెద్ద ఇండస్ట్రీ అవడంతో సినిమాలు చేయడానికి భయపడ్డానని తెలిపింది.
అప్పుడే తన తండ్రి తెలుగు సినీ పరిశ్రమ గురించి చాలా మంచిదని, గొప్పదని చెప్పి తనతో చేయించారట. అందుకే తను టాలీవుడ్ లో ప్రస్తుతం ఈ స్థాయిలో ఉండటానికి కారణం తన తండ్రి అని తెలిపింది. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…