Tik Tak Durgarao: సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఎంతగా అంటే ఏకంగా సెలబ్రిటీలుగా మారిపోయేలా క్రేజ్ దక్కించుకొని ప్రస్తుతం వెండితెర అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీగా మారిన వారిలో టిక్ టాక్ దుర్గారావు ఒకరు.
ఈయన ఎక్కడో మారుమూల గ్రామంలో రోజువారి కూలి పనులు చేస్తూ మేనల్లుడు సహాయంతో టిక్ టాక్ వీడియోలు చేయడం నేర్చుకున్నారు. ఈ విధంగా రోజు కూలి పనులకు వెళుతూ సాయంత్ర సమయంలో తన భార్యతో కలిసి టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసే వారు. ఇలా వీరిద్దరి డాన్స్ వీడియోలకు ఎంతోమంది అభిమానులుగా మారిపోయారు.
టిక్ టాక్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలో నే ఏకంగా 25 లక్షల మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు. ఇక ఇలా వీరిద్దరికి వచ్చిన పాపులారిటీతో ఏకంగా సినిమా అవకాశాలను, అలాగే బుల్లితెర పై పలు కార్యక్రమాలలో సందడి చేస్తూ సెలబ్రిటీలుగా మారారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దుర్గా రావు దంపతులు వారి జర్నీ గురించి చెబుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు.
రోజువారీ కూలీ పనులు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్న తనకు తన మేనల్లుడు ద్వారా టిక్ టాక్ వీడియోలు చేయడం నేర్చుకున్నాను. అయితే తన భార్యతో కలిసి టిక్ టాక్ వీడియోలు చేస్తున్న సమయంలో ఊర్లో దాదాపు 80% మంది తనని విమర్శించారని ఈ సందర్భంగా ఆయన ఎమోషనల్ అయ్యారు. వీడు పెళ్ళాంతో కలిసి చిందులు వేయడం ఏంటి అంటూ సొంత వాళ్లే మమ్మల్ని దారుణంగా తింటారు. అయితే మేం అవేమీ పట్టించుకోకుండా మేము చేసే పని చాలా నిజాయితీగా చేస్తున్నాము, ఎలాంటి తప్పు పని చేయలేదనీ వారి మాటలు పట్టించుకోకుండా మా ప్రయత్నాలు మేము చేసాము. ఆ భగవంతుడి దయవల్ల, అభిమానులు ఎంతగానో ఆదరించి తనకంటూ ఒక గుర్తింపు ఇచ్చారని ఈ సందర్భంగా టిక్ టాక్ దుర్గా రావు దంపతులు ఎమోషనల్ అవుతూ ఈ విషయాలను వెల్లడించారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…