MV Raghu : సినిమాటోగ్రాఫర్ గా ‘కళ్ళు’ సినిమాతో మంచి గుర్తింపునే కాకుండా, అవార్డులు కూడా తెచ్చుకున్న, భీమవరానికి చెందిన ఎమ్ వి రఘు చాలా చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసారు. కోదండ రామిరెడ్డి, ముత్యాల సుబ్బయ్య, కే విశ్వనాధ్ వంటి ప్రముఖ దర్శకులకు వర్క్ చేసిన ఆయన మోహన్ బాబు సినిమాలకు వరుసగా పని చేసి ఆ తరువాత మానేశారు. ఇక కే విశ్వనాధ్ గారితో కూడా గొడవ జరిగింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలపై స్పందించారు.
అకామిడేషన్ విషయంలో మోహన్ బాబు అలా అన్నారు….
డిటేక్టివ్ నారద సినిమా నుండి రాయుడు సినిమా వరకు వరుసగా ఆరు సినిమాలకు రఘు సినిమాటోగ్రాఫర్ గా పని చేసారు. అయితే మోహన్ బాబు ఒక అగ్నిపర్వతం లాంటి వాడని వేరే ఎవరిపైన అయినా కోపం ఉన్నా అది సెట్లో అందరిపైనా ప్రభావం పడుతుందని దానివల్ల నేను చాలా ఒత్తిడికి గురయ్యేవాడినని చెప్పారు. ఇక ఒక సినిమా షూటింగ్ సమయంలో ఫైట్ మాస్టర్ కి స్టార్ హోటల్ లో అకామిడేషన్ ఇచ్చి నాకు మాత్రం వసతులు సరిగా లేని రూమ్ ఇచ్చారు. నేను వెళ్లి మోహన్ బాబు గారిని ఇదేమిటని అడిగితే ఆయన నన్నే అడుగుతావా అంటూ మాట్లాడారు.
నేను సైలెంట్ గా వచ్చేసాను కానీ అదేమంత పెద్ద వివాదం కాదు. కానీ ఆయన సినిమా టైములో నేను బాగా ఒత్తిడికి లోనవుతుండడంతో నా కుటుంబం ఇక ఆయన సినిమాలకు పనిచేయవద్దని చెప్పడంతో మానేశానని చెప్పారు. ఇక కే విశ్వనాధ్ వంటి దిగ్గజ దర్శకుడితో సిరివెన్నెల, స్వాతి ముత్యం సినిమాలకు పని చేసిన ఆయన ఎందుకు కొనసాగించలేదనే ప్రశ్నకు గొడవలేవి లేవని చెబుతూనే, నా అసిస్టెంటులకు భోజనం పెట్టకపోవడంతో వారిని బయటకు పంపేవాడినని ఈవిషయంలో కే విశ్వనాధ్ గారికి నాకు విబేధాలు వచ్చాయని అయితే డైరెక్టుగా వివాదం రాలేదు కావాలని మధ్యలో ఉన్న వాళ్లే ఇలా గ్యాప్ పెంచారని చెప్పారు.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…