Naga Babu:తెలుగు సినిమా పరిశ్రమలో మెగా కుటుంబానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఇక మెగా కుటుంబంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ హీరోలుగా కొనసాగుతున్నప్పటికీ నాగబాబు మాత్రం హీరోగా సక్సెస్ కాలేకపోయారు. ఈ క్రమంలోనే నాగబాబు అంజన ప్రొడక్షన్స్ స్థాపించి నిర్మాతగా మారారు. ఇలా ఈయన పలు సినిమాలను నిర్మించడమే కాకుండా బుల్లితెర కార్యక్రమాల ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇకపోతే నాగబాబుకు ఒక కుమారుడు కూతురు అనే విషయం మనకు తెలిసిందే వరుణ్ తేజ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండగా నిహారిక మాత్రం 2020 డిసెంబర్లో జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకొని ప్రస్తుతం వెబ్ సిరీస్లను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే నిహారిక పెళ్లి జరిగి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు తన అల్లుడికి ఇచ్చిన కట్టకానులకు సంబంధించిన వార్తల ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నాగబాబు తన కూతురి వివాహాన్ని రాజస్థాన్ లోని పురాతనమైన కోటలో ఎంతో ఘనంగా నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహం ఎంతో ఘనంగా జరిగింది.ఈ పెళ్లి కోసమే నాగబాబు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్లు సమాచారం. ఇది కాకుండా తన అల్లుడికి 15 కోట్ల రూపాయల కట్నం ఇచ్చారని దీనితో పాటు ఒక ఖరీదైన కారు ఇల్లు కూడా కట్నంగా ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.
ఇక పెళ్లి కోసం నిహారికకు నాగబాబు ఏకంగా నాలుగు కోట్ల రూపాయల విలువచేసే ఆభరణాలను కొనుగోలు చేశారు. ఇలా నిహారిక పెళ్లి కోసం అన్ని ఖర్చులు కలుపుకుంటే నాగబాబు దగ్గర దగ్గరగా 40 కోట్లకు పైగా ఖర్చు చేశారని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా పెళ్లి విషయంలో కట్న కానుకల విషయంలో నాగబాబు మెగా రేంజ్ కి ఏమాత్రం తగ్గలేదని తెలుస్తుంది.ఇక పెళ్లి తర్వాత వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి నిహారిక ప్రసాదం వెబ్ సిరీస్ లకు నిర్మాతగా మారి ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…