Jordar Sujatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగడమే కాకుండా ఏకంగా సినిమా అవకాశాలను అందుకొని వెండితెరపై సందడి చేస్తున్నారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా గుర్తింపు సంపాదించుకున్న వారిలో జోర్దార్ సుజాత రాకింగ్ రాకేష్ ఒకరు. వీరిద్దరూ జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు.
ఇకపోతే రాకింగ్ రాకేష్ సుజాత ఇద్దరు లవ్ స్కిట్లు చేయటం వల్ల కేవలం జబర్దస్త్ కోసమే ఇలాంటి స్కిట్లు చేస్తున్నారని అందరూ భావించారు కాకపోతే వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే విషయాన్ని తెలియజేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. పెళ్లికూడా చేసుకోబోతున్నామని చెప్పిన ఈ జంట తరచూ పలు ప్రాంతాలను సందర్శిస్తూ పెద్ద ఎత్తున ఎంజాయ్ చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా రాకింగ్ రాకేష్ తో కలిసి సుజాత తిరుపతి వెళుతున్నానని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేశారు. ఇలా తిరుపతి వెళ్తూ దారిలో నగరిలో ఉన్నటువంటి రోజా గారి ఇంటికి వెళ్లి తనని కలిసి వెళ్తామని ఈ వీడియో ద్వారా తెలియజేశారు.ఇక రోజా గారి వల్లే మా ప్రేమ విషయాన్ని బయటకు చెప్పే అవకాశం వచ్చిందని సుజాత ఈ సందర్భంగా వెల్లడించారు.
ఒకవేళ రోజా గారు లేకపోతే తన ప్రేమ విషయం ఇంత తొందరగా బయటకు రాదని తన వల్లే మా ప్రేమ విషయం బయటపడటమే కాకుండా త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నామని తెలిపారు. ఇలా మరి కొద్ది రోజులలో తన పెళ్లి తేదీని కూడా ప్రకటిస్తామని సుజాత చెప్పడంతో ఈ విషయం కాస్త వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు జోర్దార్ సుజాత, రాకేష్ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…
ఉదయం నిద్రలేవగానే బెడ్ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…