CPI Narayana: సీపీఐ నారాయణ గత సీజన్లో నుంచి బిగ్ బాస్ కార్యక్రమం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈయన సీజన్ సిక్స్ గురించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ మండిపడ్డారు.బిగ్ బాస్ కార్యక్రమం ఒక బ్రోతల్ హౌస్ అంటూ షాకింగ్ కామెంట్ చేయడమే కాకుండా ఇలాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి నాగార్జునపై కూడా మండిపడ్డారు.
ఈ విధంగా బిగ్ బాస్ కార్యక్రమం గురించి నారాయణ తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.అయితే తాజాగా మరోసారి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్లంతా వ్యభిచారులే అన్నట్టు ఈయన చేసిన ఈ కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల కాలంలో నల్గొండ జిల్లాలో వ్యభిచారులుగా ఉన్నటువంటి ఓ సాధారణ ఇద్దరూ మహిళలకు గుండు కొట్టించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే వాళ్లు వ్యభిచారులు అంటూ గుండు కొట్టించారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నది ఎవరు? వీరు వ్యభిచారులని గుండు కొట్టిస్తే మరి వాళ్లకు కూడా గుండు కొట్టించాల్సిందే. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లను కూడా వ్యభిచారులుగా పోలుస్తూ వారికి గుండు కొట్టించాలని, అలా కాకుండా వారికి క్లాప్స్ కొడుతూ వారిని సపోర్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఈ విధంగా రోజు రోజుకు నారాయణ బిగ్ బాస్ కార్యక్రమం గురించి చాలా దిగజారి మాట్లాడటంతో ఎంతోమంది నెటిజన్ లు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ లు ఇతని పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నారాయణ ఈ కార్యక్రమం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు అయితే నారాయణ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న నాగార్జున పరోక్షంగా తనపై కౌంటర్లు వేసిన విషయం మనకు తెలిసిందే అయితే తాజాగా ఈయన చేసిన వ్యాఖ్యలు ఎంతటి పరిణామాలకు దారితీస్తాయో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…