Naga Chaitanya: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన నటించిన థాంక్యూ సినిమా కాస్త నిరాశపరిచినప్పటికీ సరికొత్త ఉత్సాహంతో దర్శకుడు వెంకట్ ప్రభు సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రస్తుతం కర్ణాటకలో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా కర్ణాటక, మాండ్య జిల్లాలోని మేల్కోటీ గ్రామంలో జరుగుతుంది. అయితే అక్కడ అధికారుల అనుమతి తీసుకుని ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్లో భాగంగా చిత్ర బృందం ఒక వైన్ షాప్ సెటప్ వేశారు.
వైన్ షాప్ సెట్ వేసిన ప్రాంతంలో రాయగోపురా దేవాలయం ఉంది. ఇలా ఆలయం ప్రాంగణంలో వైన్ షాప్ సెట్ వేయడమే కాకుండా ఈ వైన్ షాప్ సెట్లో చిందులు వేస్తూ షూటింగ్ జరుపుకుంటూ ఉండగా స్థానికంగా ఉన్నటువంటి ప్రేక్షకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక్కసారిగా చిత్ర బృందంపై దాడి చేశారు. పవిత్రమైన దేవాలయం ఉండే ప్రాంతంలో ఇలా వైన్ షాప్ సెట్ వేయడమే కాకుండా హిందూ ధర్మాన్ని అవమాన పరుస్తున్నారంటూ పెద్ద ఎత్తున మండిపడ్డారు.
ఈ క్రమంలోనే స్థానిక ప్రజలు ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇవ్వగా రంగంలోకి దిగిన పోలీసులు సినిమా షూటింగును రద్దు చేశారు. సినిమా షూటింగ్ కిఇచ్చిన అనుమతులను కూడా రద్దు చేయడంతో చిత్ర బృందం చేసేదేమి లేక ఈ సినిమా షూటింగ్ ఆపివేశారు.ఇలా వైన్ షాప్ సెట్ వేసిన తర్వాత షూటింగ్ ఆపివేయడంతో భారీ మొత్తంలోనే నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయం గురించి చిత్ర బృందం ఎక్కడ స్పందించకపోవడం గమనార్హం. ఇక ఈ సినిమాలో నాగచైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…