Naga Chaitanya: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన నటించిన థాంక్యూ సినిమా కాస్త నిరాశపరిచినప్పటికీ సరికొత్త ఉత్సాహంతో దర్శకుడు వెంకట్ ప్రభు సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రస్తుతం కర్ణాటకలో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా కర్ణాటక, మాండ్య జిల్లాలోని మేల్కోటీ గ్రామంలో జరుగుతుంది. అయితే అక్కడ అధికారుల అనుమతి తీసుకుని ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్లో భాగంగా చిత్ర బృందం ఒక వైన్ షాప్ సెటప్ వేశారు.
వైన్ షాప్ సెట్ వేసిన ప్రాంతంలో రాయగోపురా దేవాలయం ఉంది. ఇలా ఆలయం ప్రాంగణంలో వైన్ షాప్ సెట్ వేయడమే కాకుండా ఈ వైన్ షాప్ సెట్లో చిందులు వేస్తూ షూటింగ్ జరుపుకుంటూ ఉండగా స్థానికంగా ఉన్నటువంటి ప్రేక్షకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక్కసారిగా చిత్ర బృందంపై దాడి చేశారు. పవిత్రమైన దేవాలయం ఉండే ప్రాంతంలో ఇలా వైన్ షాప్ సెట్ వేయడమే కాకుండా హిందూ ధర్మాన్ని అవమాన పరుస్తున్నారంటూ పెద్ద ఎత్తున మండిపడ్డారు.
ఈ క్రమంలోనే స్థానిక ప్రజలు ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇవ్వగా రంగంలోకి దిగిన పోలీసులు సినిమా షూటింగును రద్దు చేశారు. సినిమా షూటింగ్ కిఇచ్చిన అనుమతులను కూడా రద్దు చేయడంతో చిత్ర బృందం చేసేదేమి లేక ఈ సినిమా షూటింగ్ ఆపివేశారు.ఇలా వైన్ షాప్ సెట్ వేసిన తర్వాత షూటింగ్ ఆపివేయడంతో భారీ మొత్తంలోనే నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయం గురించి చిత్ర బృందం ఎక్కడ స్పందించకపోవడం గమనార్హం. ఇక ఈ సినిమాలో నాగచైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…