‘జబర్దస్త్’ అంటే కొన్ని రోజుల క్రితం టక్కున గుర్తుకు వచ్చే పేర్లలో ముఖ్యంగా నాగబాబు ఒకరు. ఈ షోకు ఆయనే పెద్ద ప్లస్. అతడి నవ్వే అద్దరినీ కట్టి పడేస్తుంది. జబర్దస్త్ లో చేసే టీం మెంబర్లకు కూడా.. తప్పొప్పులు చెబుతూ.. దగ్గరుండి ముందుకు నడిపించాడు. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల నాగబాబు జబర్దస్త్ నుంచి వెళ్లిపోయి.. జీ లో కొత్త కామెడీ షోకి శ్రీకారం చుట్టాడు.
అందులో జడ్జిగా వ్యవహరించాడు. ‘అదిరింది’ అనే కామెడీ షోని జీలో ప్రసారం చేశారు. అందులో కూడా సీనియర్ టీం లీడర్లు అయిన చమక్ చంద్ర, వేణు, ధన్ రాజ్ లాంటి వాళ్లు చేశారు. మళ్లీ ఆ షో కూడా కొన్ని కారణాల వల్ల నిలిపివేశారు. ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఈ సీజన్ వరకు ఇంతే.. మళ్లీ మరో సీజన్ మొదలవుతుంది అని చెప్పుకొచ్చారు.
ఏదేమైనా కొన్నాళ్ల వరకు బాగానే రన్ అయిన ‘అదిరింది’ షో నిలిపివేశారు. ఇక తర్వాత చాలా రోజుల వరకు గ్యాప్ తీసుకొని.. ఇప్పటికే మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ షోలో ఎంట్రీ ఇచ్చాడు. అతడు ఈ షోకి జడ్జిగా వచ్చారు. కొన్ని రోజుల క్రితం వరకు షోకి శేఖర్ మాస్టర్ జడ్జిగా ఉండేవారు. తర్వాత ఏమైందో ఏమో గానీ.. గత రెండు, మూడు ఎపిసోడ్ల నుండి ఆయన రావడం లేదు.
శేఖర్ మాస్టార్ బహుషా కొరియోగ్రఫీలో బిజీ అయిపోయరేమో. అయితే ఆయన స్థానంలో అలీ వచ్చారు. ఇప్పుడు నాగబాబు ఫుల్ టైమ్ జడ్జిగా వచ్చారట. ఆయన ఎంట్రీలో శ్రీముఖి డైలాగ్తో ఈ విషయం తేలిపోయింది. అయితే ఎందుకు లేటు అనేది మాత్రం చెప్పలేదు. అయితే ఇప్పుడు నాగబాబు రాకతో ఈ షో ఎంత వరకు ఆకట్టుకుంటుదో చూడాలి.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…