Nagababu: మెగా బ్రదర్ నాగబాబు తాజాగా నటి లావణ్య త్రిపాఠి గురించి సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందాల రాక్షసి సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి లావణ్య త్రిపాఠి మొదటి సినిమాతోనే తన నటన ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించారు.
ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అయిన తర్వాత ఈమె వరసగా సినిమాలలో నటించారు. ఇకపోతే ఇటీవల లావణ్య మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. నటుడు వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకున్నటువంటి ఈమె మెగా ఇంటి కోడలు అయ్యారు. ఇక లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్న తర్వాత నటించినటువంటి మిస్ ఫర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది.
ఇకపోతే తాజాగా ఈ సిరీస్ గురించి లావణ్య త్రిపాఠి నటన గురించి నాగబాబు ఇంస్టాగ్రామ్ వేదికగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మై డియర్ లావణ్య నటించిన మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ అద్భుతంగా ఉంది. వినోదాత్మక అంశాలతో కట్టిపడేసింది. అందరి చూడాల్సిన వెబ్ సిరీస్ అని ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేశాడు.
లావణ్య పై పొగడ్తల వర్షం..
ఇలా పరోక్షంగా నాగబాబు ఈ సిరీస్ ప్రమోట్ చేశారు. ఇక లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత కూడా సినిమాలలో నటించబోతున్నారని విషయం మనకు తెలిసిందే. ఈమెకు నటన పరంగా ఏ విధమైనటువంటి ఆంక్షలు లేవు. ఇక ఈమె పెళ్లి తర్వాత కూడా ఒక సినిమాకు కమిట్ అయ్యారనే విషయాన్ని ఇటీవల లావణ్య వెల్లడించారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…