Nagachaitanya: అక్కినేని వారసుడు నాగచైతన్య ప్రస్తుతం ‘ కస్టడీ ‘ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది . ఈ సినిమాలో నాగచైతన్యకి జోడిగా కృతి శెట్టి నటిస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ జంటగా నటించిన బంగార్రాజు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
ఇక మరొకసారి వీరిద్దరూ కస్టడీ సినిమాలో జంట కట్టారు. ఈ సినిమా మే 12వ తేదీ ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ పనులు ప్రారంభం అయ్యాయి.
ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ముఖ్యంగా తన జీవితంలో బాధపడిన సందర్భాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఈ ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ.. ” ఇప్పటివరకు నా జీవితంలో ఎటువంటి బాధాకరమైన సంఘటనలు జరగలేదు.
జీవితంలో ఎదురైన ప్రతి సంఘటన ఒక పాఠం నేర్పింది. కానీ కొన్ని సందర్భాలలో సినిమాల విషయంలో బాధపడ్డాను. ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల ఆ మూడు సినిమాల విషయంలో ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాను ” అంటూ నాగచైతన్య చెప్పుకొచ్చాడు.అయితే నాగచైతన్య కెరీర్ లో సరైన నిర్ణయం తీసుకోలేకపోయిన ఆ మూడు సినిమాలు ఏమిటా? అని అభిమానులు ఆలోచనలో పడ్డారు.
ఇదిలా ఉండగా సమంతకి దూరమైన తర్వాత నాగచైతన్య వరుస ప్రాజెక్టులకు సైన్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల థాంక్యూ సినిమా ద్వారా పరాజయం అందుకున్న నాగచైతన్య ప్రస్తుతం కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాపై నాగచైతన్య చాలా నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…