Nagachaitanya: అక్కినేని వారసుడు నాగచైతన్య ప్రస్తుతం ‘ కస్టడీ ‘ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది . ఈ సినిమాలో నాగచైతన్యకి జోడిగా కృతి శెట్టి నటిస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ జంటగా నటించిన బంగార్రాజు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
ఇక మరొకసారి వీరిద్దరూ కస్టడీ సినిమాలో జంట కట్టారు. ఈ సినిమా మే 12వ తేదీ ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ పనులు ప్రారంభం అయ్యాయి.
ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ముఖ్యంగా తన జీవితంలో బాధపడిన సందర్భాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఈ ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ.. ” ఇప్పటివరకు నా జీవితంలో ఎటువంటి బాధాకరమైన సంఘటనలు జరగలేదు.
జీవితంలో ఎదురైన ప్రతి సంఘటన ఒక పాఠం నేర్పింది. కానీ కొన్ని సందర్భాలలో సినిమాల విషయంలో బాధపడ్డాను. ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల ఆ మూడు సినిమాల విషయంలో ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాను ” అంటూ నాగచైతన్య చెప్పుకొచ్చాడు.అయితే నాగచైతన్య కెరీర్ లో సరైన నిర్ణయం తీసుకోలేకపోయిన ఆ మూడు సినిమాలు ఏమిటా? అని అభిమానులు ఆలోచనలో పడ్డారు.
ఇదిలా ఉండగా సమంతకి దూరమైన తర్వాత నాగచైతన్య వరుస ప్రాజెక్టులకు సైన్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల థాంక్యూ సినిమా ద్వారా పరాజయం అందుకున్న నాగచైతన్య ప్రస్తుతం కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాపై నాగచైతన్య చాలా నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…