Featured

Nagarjuna: ఆ విషయంలో అభిమానులకు క్షమాపణలు చెప్పిన నాగార్జున.. అసలేం జరిగిందంటే?

Nagarjuna: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం బంగార్రాజు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా మ్యూజిక్ నైట్స్ అనే కార్యక్రమాన్ని అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

Nagarjuna: ఆ విషయంలో అభిమానులకు క్షమాపణలు చెప్పిన నాగార్జున.. అసలేం జరిగిందంటే?

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్ చిత్రంగా తెరకెక్కింది. ఈ సినిమాను మించి బంగార్రాజు చిత్రం ఉండబోతోందని తెలిపారు. ఈ సినిమా జనవరి 14వ తేదీ విడుదల కావడం ఎంతో ఆనందంగా ఉంది. అదే రోజున అన్నపూర్ణ స్టూడియో కూడా పుట్టిందని నాగార్జున గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ ఎంతో అద్భుతమైన సంగీతం అందించారని ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన నాగార్జున అభిమానులకు కూడా క్షమాపణలు చెప్పారు.అసలు నాగార్జున అభిమానులకు ఎందుకు క్షమాపణలు చెప్పారు అనే విషయానికి వస్తే…

కరోనా కారణం వల్ల ఆ కండిషన్ తప్పలేదు…

జనవరి 14వ తేదీ సినిమా విడుదల కావడంతో ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ వేడుకను ఈ నెల 11వ తేదీ నిర్వహించనున్నట్లు తెలిపారు.అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ వేడుకకు అభిమానులను ఎవరిని పిలవడం లేదని అందుకు ప్రతి ఒక్క అభిమానికి తాను క్షమాపణలు చెబుతున్నట్లు నాగార్జున ఈ వేదికపై తెలియజేశారు. ఇక ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటించగా నాగచైతన్య సరసన కృతి శెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

4 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

5 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

6 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

6 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

7 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

7 hours ago