Nagarjuna: తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగేశ్వరరావు ఆరు దశాబ్దాల సినీ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలలో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ఇక ఈయన వారసుడిగా నాగార్జున కూడా బాలా నటుడుగా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.
ఇలా నాగార్జున తెలుగు చిత్ర పరిశ్రమలో ఆగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక ఈయన వారసులుగా ఇండస్ట్రీలోకి అఖిల్ నాగచైతన్య వచ్చారు. అయితే వీరిద్దరూ మాత్రం తన తాత, తండ్రి సంపాదించుకున్నంత క్రేజ్ సంపాదించుకోలేకపోయారు. ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా నిలదొక్కుకోవడం కోసం ఎంతో కృషి చేస్తున్నప్పటికీ నాగచైతన్య, అఖిల్ మాత్రం ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయారు.
ఈ విధంగా చిన్నప్పటినుంచి సినిమా వాతావరణంలోనే పెరిగిన ఈ ఇద్దరు ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోవడంతో నాగార్జున వీరి విషయంలో ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.తన కొడుకులను ఎలాగైనా ఇండస్ట్రీలో నిలబెట్టాలన్న ఉద్దేశంతో నాగార్జున మొదటిసారి తనకు ఏమాత్రం ఇష్టం నమ్మకం లేకపోయినా తన కొడుకుల భవిష్యత్తు కోసం అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
సాధారణంగా నాగార్జున పూజలు, హోమాలు, జాతకాలను నమ్మరు కానీ తన కొడుకుల భవిష్యత్తు కోసం ఎంతో పేరుగాంచిన పండితులను ఇంటికి పిలిపించి వారి జాతకాలు చూపించి,జాతకంలో దోషాల పరిహార కోసం ఇంట్లో ప్రత్యేకంగా పూజలు హోమాలు చేస్తున్నారనే వార్తలు టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.ఇలా నాగార్జున ఇంట్లో పెద్ద ఎత్తున పూజలు హోమాలు చేస్తున్నారంటూ వచ్చే వార్తలలో ఎంతవరకు నిజమందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…