Namrata shirodkar: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ గురించి పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త తరహా సినిమాలను పరిచయం చేసిన ఘనత ఈయనకే చెల్లిందని చెప్పాలి. ఇలా కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి మహేష్ బాబు ఆయన కుమార్తె మంజుల కూడా అడుగుపెట్టారు.మహేష్ బాబు ప్రస్తుతం ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతుండగా మంజుల మాత్రం అడపా దడపా సినిమాలలో నటించారు.
ఇకపోతే మహేష్ బాబు వంశీ సినిమా షూటింగ్ సమయంలో నటి నమ్రత ప్రేమలో పడి తనని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. పెళ్లి అనంతరం పూర్తిగా సినిమాలకు దూరంగా ఉండి కేవలం కుటుంబ బాధ్యతలను మాత్రమే నిర్వర్తిస్తున్నారు. ఇలా పిల్లల బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్న ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఇలా నిత్యం తనకు తన పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటారు.
ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నమ్రత మహేష్ బాబు సోదరి మంజుల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ మంజులను తాను ఒక పార్టీలో మొదటిసారిగా కలిశానని తెలిపారు.అయితే అప్పటికి నేను మహేష్ బాబుని ప్రేమిస్తున్న విషయం తనకు తెలియదని, ఆ తరువాత తన ప్రేమ విషయం మంజులకు తెలియడంతో తాను తమ ప్రేమ పెళ్లి విషయంలో ఎంతో సపోర్ట్ చేశారని నమ్రత వెల్లడించారు.
ఇకపోతే ఆ పార్టీలో ఏర్పడిన మా పరిచయం అనంతరం ఫ్యామిలీగా మారడమే కాకుండా తను నాకు బెస్ట్ ఫ్రెండ్ గా మారిపోయిందని తనతో ఉన్న రిలేషన్ గురించి నమ్రత వెల్లడించారు. ఇక పిల్లల గురించి నమ్రత మాట్లాడుతూ మంజులకు అసలు పిల్లల్ని కనడం ఏ మాత్రం ఇష్టం లేదు.అయితే అనుకోకుండా ఇద్దరికీ ఒకే సారి ప్రెగ్నెన్సీ రావడం పిల్లల్ని కనడం జరిగిపోయిందని ఈమె తెలిపారు. ప్రస్తుతం తను ఒక కూతురికి తల్లిగా, ఎంతో ప్రేమతో తన కూతురు బాధ్యతలను చూసుకుంటూ సంతోషంగా ఉందని ఈ సందర్భంగా నమ్రత మంజుల గురించి వెల్లడించారు. ప్రస్తుతం నమ్రత చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…