Namrata shirodkar: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ గురించి పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త తరహా సినిమాలను పరిచయం చేసిన ఘనత ఈయనకే చెల్లిందని చెప్పాలి. ఇలా కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి మహేష్ బాబు ఆయన కుమార్తె మంజుల కూడా అడుగుపెట్టారు.మహేష్ బాబు ప్రస్తుతం ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతుండగా మంజుల మాత్రం అడపా దడపా సినిమాలలో నటించారు.
ఇకపోతే మహేష్ బాబు వంశీ సినిమా షూటింగ్ సమయంలో నటి నమ్రత ప్రేమలో పడి తనని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. పెళ్లి అనంతరం పూర్తిగా సినిమాలకు దూరంగా ఉండి కేవలం కుటుంబ బాధ్యతలను మాత్రమే నిర్వర్తిస్తున్నారు. ఇలా పిల్లల బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్న ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఇలా నిత్యం తనకు తన పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటారు.
ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నమ్రత మహేష్ బాబు సోదరి మంజుల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ మంజులను తాను ఒక పార్టీలో మొదటిసారిగా కలిశానని తెలిపారు.అయితే అప్పటికి నేను మహేష్ బాబుని ప్రేమిస్తున్న విషయం తనకు తెలియదని, ఆ తరువాత తన ప్రేమ విషయం మంజులకు తెలియడంతో తాను తమ ప్రేమ పెళ్లి విషయంలో ఎంతో సపోర్ట్ చేశారని నమ్రత వెల్లడించారు.
ఇకపోతే ఆ పార్టీలో ఏర్పడిన మా పరిచయం అనంతరం ఫ్యామిలీగా మారడమే కాకుండా తను నాకు బెస్ట్ ఫ్రెండ్ గా మారిపోయిందని తనతో ఉన్న రిలేషన్ గురించి నమ్రత వెల్లడించారు. ఇక పిల్లల గురించి నమ్రత మాట్లాడుతూ మంజులకు అసలు పిల్లల్ని కనడం ఏ మాత్రం ఇష్టం లేదు.అయితే అనుకోకుండా ఇద్దరికీ ఒకే సారి ప్రెగ్నెన్సీ రావడం పిల్లల్ని కనడం జరిగిపోయిందని ఈమె తెలిపారు. ప్రస్తుతం తను ఒక కూతురికి తల్లిగా, ఎంతో ప్రేమతో తన కూతురు బాధ్యతలను చూసుకుంటూ సంతోషంగా ఉందని ఈ సందర్భంగా నమ్రత మంజుల గురించి వెల్లడించారు. ప్రస్తుతం నమ్రత చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…