Nandamuri Balakrishna : ఈమధ్య దేశంలో కరోనా కేసుల పెరుగుదల మళ్ళీ మొదలైంది. ముఖ్యంగా సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఉపాసన కామినేని తనకు కరోనా పాజిటివ్ అని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. తరువాత కరణ్ జోహార్ పుట్టినరోజు వేడుకకు హాజరు అయిన కొంతమంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ కూడా ఈ కోవాలో చేరారు. ఇక ఈ మధ్య షారుఖ్ ఖాన్, దీపిక పదుకొనే కూడా కరోనా పాజిటివ్ అని తెలియజేసారు. ఇక ఇపుడు కరోనా లిస్ట్ లో నందమూరి బాలకృష్ణ చేరిపోయారు. ఇది అభిమానులను కలవరపెడుతోంది.
హోమ్ ఐసొలేషన్లో నందమూరి బాలకృష్ణ…
తాజాగా సినీ హీరో, హిందూపూర్ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ కరోనా బారిన పడినట్లు తెలియజేసాడు. ఇటీవల చేయించుకున్న కరోనా పరీక్షల్లో పాజిటివ్ గా నిర్దారణ అయింది. ప్రస్తుతం హోం ఐసొలేషన్లో ఉన్నట్లు తెలియజేసారు. తాను పూర్తి ఆరోగ్యాంగా వున్నానని, గత రెండు రోజులుగా తనతో సన్నిహితంగా వున్న వారు కరోనా నిర్దారణ పరీక్షలు చేయించికోవాలని అందరికి సూచించారు. ఆయన కరోనా నుండి త్వరగా కోలుకోవాలని ఆత్మీయులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా అభిమానాన్ని చాటుకుంటున్నారు.
ఇక ప్రస్తుతం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహారిస్తున్న అన్ స్టాపబుల్ ప్రోగ్రాం త్వరలోనే మొదలుకానుంది. తాజాగా గోపించంద్ మలినేని దర్శకత్వంలో శృతిహాసన్ హీరోయిన్ గా ఒక సినిమా చేస్తున్నారు. దీని తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో విభిన్న చిత్రం చేయబోతున్నారు. ఇక బాలకృష్ణ కరోనా నుండి త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ప్రతిరోజూ భక్తితో పూజలు చేస్తున్నా జీవితంలో ఆశించిన మార్పులు కనిపించకపోవడం చాలా మందిని ఆలోచనలో పడేస్తుంది. దీని వెనుక కారణాలు…
తీపి పదార్థాలు తిన్న వెంటనే మనకు ఉత్సాహం పెరిగినట్లు అనిపించడం సహజం. చాక్లెట్, స్వీట్లు తీసుకున్న కొన్ని నిమిషాల్లోనే శరీరంలో…
ప్రకృతిలో లభించే పండ్లలో కొన్నివి చూసేందుకు విచిత్రంగా కనిపించినా, వాటి లోపల దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి.…
ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు సాధారణంగా నొప్పి, జ్వరం వంటి సంకేతాలు కనిపిస్తాయని అనుకుంటాం. అయితే కొన్ని వ్యాధులు ఎలాంటి స్పష్టమైన…
వేసవి కాలంలో లభించే అరుదైన పండ్లలో పాల పండు ఒకటి. చాలా మందికి ఈ పండు గురించి పెద్దగా తెలియకపోయినా,…
ప్రతి ఇంటి వంటగదిలో సులభంగా దొరికే బేకింగ్ సోడా, వంటల్లో మాత్రమే కాదు, రోజువారీ పనుల్లో కూడా ఎంతో ఉపయోగకరంగా…