Nandamuri Kalyan Ram: నందమూరి నట వారసుడిగా నందమూరి హరికృష్ణ వారసుడు కళ్యాణ్ రామ్ 2003 లో వచ్చిన ‘తొలి చూపులోనే’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. 2005 లో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘అత్తనొక్కడే’ సినిమాతో మంచి విజయాన్ని అందికున్నాడు. కెరీర్ హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా కొత్త ప్రయోగాలతో సినిమాలు చేస్తుంటాడు. ప్రస్తుతం కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా ‘బింబిసార’. ఆగష్టు 5 న ప్రేక్షకుల ముందుకి ఈ సినిమా వస్తోంది. అయితే విడుదల సమయం దగ్గర ఉండటం తో ప్రమోషన్లలో ఉన్నారు చిత్ర బృందం. ఈ క్రమంలో లోనే కళ్యాణ్ రామ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
సినిమాలకు దూరమవుదామా అని అనిపించిందని…
ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణ్ రామ్ తన కెరీర్ గురించి చాలా విషయాలు పంచుకున్నారు. సినిమాలో హిట్లు ప్లాపులు సర్వ సాధారణం. హిట్లు వస్తాయి, వరుస అవకాశాలు క్యూ కడతాయి. అదే ప్లాప్ వస్తే పలకరించే వారు ఉండకపోవడమే కాదు ఆర్థికంగా కూడా చాలా దెబ్బ పడుతుంది. ఇలానే తన కెరీర్ లో కూడా ఒక సినిమా తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని కళ్యాణ్ రామ్ చెప్పుకోచ్చారు. ఆ సమయంలో కుటుంబం అండగా నిలబడింది అని చెప్పారు.
నా కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని, కథను బాగా నమ్మి భారీ బడ్జెట్తో నిర్మించిన చిత్రం ఓం (3డీ). అయితే ఆ సినిమా విషయంలో నా అంచనాలు పూర్తిగా తలకిందులు అయ్యాయి. ఓం సినిమా కథను నేను చాలా నమ్మి తీసాను. అనుకున్న దానికి పూర్తి భిన్నంగా ఫలితం వచ్చింది. ఆ సమయంలో చాలా డిప్రెషన్ కు లోనవ్వడమే కాకుండా సినిమాలకు దూరమవుదామా అన్న ఆలోచన కూడా వచ్చింది. అని కళ్యాణ్ రామ్ చెప్పుడు. ఆర్థికంగా కూడా ఆ సినిమా నన్ను కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టిందని చెప్పుకొచ్చాడు. అయితే ఆ తరువాత పటాస్ సినిమాతో వచ్చిన నష్టం పోయిందని చెప్పారు. అయితే ఇపుడు వస్తున్న బింబిసార మీద చాలా నమ్మకం ఉందని చెప్పారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…