ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నారా భువనేశ్వరి గురించి వైఎస్ఆర్ సీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబునాయుడు మీడియా ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. ఈ క్రమంలోనే తను ముఖ్యమంత్రి అయిన తరువాత మాత్రమే అసెంబ్లీ లోకి అడుగు పెడతానని శపథం చేసి బయటకు వెళ్లారు. ఇదిలా ఉండగా ఈ ఘటన గురించి ఎంతో మంది సినీ హీరోలు టిడిపి అభిమానులు స్పందించి నారా భువనేశ్వరికి మద్దతు తెలిపారు.
ఇకపోతే ఈ విషయంపై నారా భువనేశ్వరి స్పందించారు.ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ శాసనసభలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తరువాత తనకు ఎంతోమంది అండగా నిలబడ్డారని ఇలా తనకు మద్దతు తెలిపిన వారందరికీ పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నాకు అవమానం జరిగితే సొంత తల్లికి, తోబుట్టువుకి జరిగిన విధంగా భావించి నాకోసం అండగా నిలిచారని ఈమె వెల్లడించారు.
చిన్నప్పటి నుంచి తమ తల్లిదండ్రులు తమని విలువలతో క్రమశిక్షణతో పెంచారని ఇప్పటికీ తను అదే విలువలను పాటిస్తున్నట్లు భువనేశ్వరి వెల్లడించారు. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కష్టాలు ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడాలని ఈమె ప్రజలకు సూచించారు.
ఇకపోతే ఒక వ్యక్తి ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడకూడదని, నేడు తనకు జరిగిన అవమానం మరెవ్వరికీ జరగకుండా ఉండాలని ఆమె ఆశిస్తున్నట్లు ఈ లేఖలో పేర్కొన్నారు. ఇలా భువనేశ్వరి అసెంబ్లీ ఘటన గురించి స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…