Movie News

అసెంబ్లీలో తనకు జరిగిన అవమానం గురించి బహిరంగ లేఖ రాసిన నారా భువనేశ్వరి..!

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నారా భువనేశ్వరి గురించి వైఎస్ఆర్ సీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబునాయుడు మీడియా ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. ఈ క్రమంలోనే తను ముఖ్యమంత్రి అయిన తరువాత మాత్రమే అసెంబ్లీ లోకి అడుగు పెడతానని శపథం చేసి బయటకు వెళ్లారు. ఇదిలా ఉండగా ఈ ఘటన గురించి ఎంతో మంది సినీ హీరోలు టిడిపి అభిమానులు స్పందించి నారా భువనేశ్వరికి మద్దతు తెలిపారు.

ఇకపోతే ఈ విషయంపై నారా భువనేశ్వరి స్పందించారు.ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ శాసనసభలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తరువాత తనకు ఎంతోమంది అండగా నిలబడ్డారని ఇలా తనకు మద్దతు తెలిపిన వారందరికీ పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నాకు అవమానం జరిగితే సొంత తల్లికి, తోబుట్టువుకి జరిగిన విధంగా భావించి నాకోసం అండగా నిలిచారని ఈమె వెల్లడించారు.

చిన్నప్పటి నుంచి తమ తల్లిదండ్రులు తమని విలువలతో క్రమశిక్షణతో పెంచారని ఇప్పటికీ తను అదే విలువలను పాటిస్తున్నట్లు భువనేశ్వరి వెల్లడించారు. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కష్టాలు ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడాలని ఈమె ప్రజలకు సూచించారు.

ఇకపోతే ఒక వ్యక్తి ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడకూడదని, నేడు తనకు జరిగిన అవమానం మరెవ్వరికీ జరగకుండా ఉండాలని ఆమె ఆశిస్తున్నట్లు ఈ లేఖలో పేర్కొన్నారు. ఇలా భువనేశ్వరి అసెంబ్లీ ఘటన గురించి స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘పసివాడి ప్రాణం’ నటుడు బాబు ఆంటోనీ లైఫ్ ఇలా మారిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…

1 day ago

చూపు లేకపోయినా సంగీతంతో ప్రపంచాన్ని గెలిచిన వైకమ్ విజయలక్ష్మి!

చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…

1 day ago

కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా నిలిచిన మహా యోధులు వీరే..!

మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…

1 day ago

కొత్త దంపతులు ముత్యాలు ధరిస్తే ఇంత మార్పా..? ముత్యాలపై నిపుణుల విశ్వాసం ఇదే!

భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…

1 day ago

ఒకే రాశి వాళ్లు పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది..? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…

1 day ago

ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అంటున్న వాస్తు నిపుణులు.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!

హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…

1 day ago