Naresh -Pavitra Lokesh: ప్రముఖ హీరోయిన్ విజయనిర్మల తనయుడు నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా ఎన్నో సినిమాలలో నటించిన మంచి గుర్తింపు పొందిన నరేష్ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఎందుకంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ తో నరేష్ కి ఉన్న సంబంధం వల్ల తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. కొంతకాలం వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
ఇక నరేష్ తన మూడవ భార్యకి విడాకులు ఇవ్వకుండా పవిత్ర లోకేష్ తో సహజీవనం చేయటంతో ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయంగా మారింది.
కొన్ని రోజులుగా బయట ఎక్కడ కనిపించని నరేష్ తాజాగా పవిత్ర లోకేష్ తో కలిసి ఉన్న వీడియో షేర్ చేయటంతో మళ్లీ వీరిద్దరి రిలేషన్ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా నరేష్ పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినట్లు ప్రకటించటంతో వీరి పెళ్లి టాపిక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇదివరకే నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భార్యలకు దూరంగా ఉంటున్నాడు. గత మూడు సంవత్సరాలుగా పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్న నరేష్ తాజాగా తనని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. అంతేకాకుండా పవిత్ర లోకేష్ నరేష్ ముద్దు పెట్టుకున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నటుడిగా మంచి గుర్తింపు పొందిన నరేష్ మొదట సినిమాటోగ్రాఫర్ శ్రీను కుమార్తెను వివాహం చేసుకొని ఒక కొడుకు పుట్టిన తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలిని రెండవ వివాహం చేసుకొని ఆమెకు ఒక కొడుకు పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుని దూరమయ్యారు.
ఇక మాజీ మంత్రి రఘువీరారెడ్డి చెల్లెలి కుమార్తె రమ్య రఘుపతిని మూడవ వివాహం చేసుకున్న నరేష్ కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావటంతో ఆమెకు కూడా దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన పవిత్ర లోకేష్ తో కొంతకాలంగా సహజీవనం చేస్తున్న నరేష్ ఇప్పుడు నాలుగవ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అయితే ఇలా ఆరుపదుల వయసులో నాలుగో వివాహం చేసుకోవడానికి సిద్ధపడటంతో నరేష్ ని తెగ ట్రోల్ చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…
ఉదయం నిద్రలేవగానే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. రాత్రి తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవడం, తగినంత…
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…