Naseer Ahmed gives clarity on Guntur TDP MLA's viral video..!
గుంటూరు: సోషల్ మీడియాలో తనపై వైరల్ అవుతున్న రాసలీలల వీడియోపై గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తీవ్రంగా స్పందించారు. ఈ వీడియో పూర్తిగా ఫేక్ అని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రపూరితంగా చేసిన ప్రచారం అని ఆయన స్పష్టంచేశారు.
నసీర్ అహ్మద్ మాట్లాడుతూ, “ప్రజాప్రతినిధులపై తప్పుడు ఆరోపణలు చేయడానికి నకిలీ కంటెంట్ను వ్యాప్తి చేయడం రాజకీయ నైతికతకు విరుద్ధం. గుంటూరు ఈస్ట్లో 20 ఏళ్ల తర్వాత తెలుగుదేశం జెండా ఎగురుతుంటే చూడలేక ప్రతిపక్షాలు ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నాయి,” అని విమర్శించారు.
“సాక్షి ఛానల్ నిజాలను చూపించడానికేనా? లేక ఇలాంటి ఫేక్ వీడియోలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించడానికేనా?” అని నసీర్ అహ్మద్ సూటిగా ప్రశ్నించారు. ఈ వీడియో నిజమని నిరూపించాలని ఆయన ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.
ఈ వీడియోపై ఇప్పటికే దర్యాప్తు జరుగుతోందని, ఫోరెన్సిక్ నిపుణులతో వీడియోను పరిశీలించి, ఈ కుట్రలో భాగమైన వారందరిపై కఠిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఇలాంటి నీచపు చర్యలను సహించబోమని ఆయన స్పష్టం చేశారు. చివరగా, ప్రజలకు పిలుపునిస్తూ, “ఇలాంటి నకిలీ ప్రచారాలను నమ్మవద్దు. నిజం వైపు నిలబడండి. ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నాలు మానుకొని, చేతనైతే ప్రజల కోసం పనిచేయండి” అని నసీర్ అహ్మద్ సందేశం ఇచ్చారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…