Natti Kumar : ఎన్టీఆర్ గారి చిన్న కూతురు ఉమా మహేశ్వరి ఆగష్టు 1 వ తేదీన ఇంట్లో ఉంటి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆ షాక్ నుండి నందమూరి కుటుంబ సభ్యులు ఇంకా తేరుకోకముందే ఈ ఇష్యూని రాజకీయం చేస్తున్నారు కొంతమంది. ఆమె ఆత్మహత్య చేసుకోడానికి లోకేష్ తో వివాదాలు కారణం అంటూ ఆరోపించారు. ఇక లక్ష్మి పార్వతి ఏకంగా ఉమా మహేశ్వరి మరణించాక చంద్రబాబు ఆమె రాసిన సుసైడ్ లెటర్ ను మాయం చేసాడని, ఈ ఉదంతం పై సిబిఐ ఎంక్వయిరీ చేయాలంటూ మీడియా మీటింగ్ పెట్టి మరీ ఆరోపించింది. ఇక అటు కొంతమంది వైసీపీ నేతలు కూడా ఉమా మహేశ్వరి మృతి పై చంద్రబాబు ను, లోకేష్ ను ఆమె చావుకు కారణం మీరే అంటూ ఆరోపిస్తున్నారు. ఒక వైసీపీ నేత ట్విట్టర్ వేదికగా హెరిటేజ్ లో ఉమా మహేశ్వరి గారికి వాటా ఉండటం వల్ల ఆ విషయంలో లోకేష్ కి ఉమా గారికి గొడవ జరిగిందంటూ ఆరోపించారు.
ఈ సమయంలో రాజకీయం అవసరమా…
ఇక ఫిల్మ్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ ఈ ఇష్యూ మీద మాట్లాడారు. ఎన్టీఆర్ గారి కూతురు మరణించి ఆయన కుటుంబం బాధలో ఉంటే ఇలాంటి ఆరోపణలు ఏంటి అంటూ ఫైర్ అయ్యారు. రాజకీయాలంటే వ్యక్తిగత విషయాల గురించి చేయకూడదంటూ చెప్పారు. లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ భార్య కదా మరి ఇంట్లో ఒక విషాదం జరిగినపుడు వీలైతే పరామర్శించి ధైర్యం చెప్పాలి అంతే కానీ ఇలాంటి ఆరోపణలను చేసి వారిని మరింత బాధపెట్టకూడదు. చంద్రబాబు నాయుడు మీద కోపం ఉంటే ఆయన మీద విమర్శలు చేయొచ్చు ఎన్టీఆర్ గారి కుటుంబాన్ని ఎందుకు లాగడం. చనిపోయిన ఆయన కూతురుని రాజకీయంగా వాడుకోవడం ఏమిటి అంటూ అభిప్రాయపడ్డారు. ఎవరైనా చనిపోయిన వారి మీద రాజకీయం చేయటం తప్పు అంటూ మాట్లాడారు.
ఆస్తి గురించి గొడవ అనే ఆరోపణలలో నిజం లేదని, ఎన్టీఆర్ గారు కూతుర్లకు కొడుకులకు సమానంగా ఆస్తి పంచారని చెప్పారు. ఇక ఒకవేళ ఆస్తి గురించి ఏదైనా ఉన్నా ఆమె తరువాత ఆస్తి కూతుర్లకు వస్తుంది ఈ విషయం అందరికీ తెలుసు. అయిన రాజకీయాల కోసం వాడుకుంటారా అని అన్నారు నట్టి కుమార్. వాళ్ళేదో విషాదం లో ఉంటే ఆమె ఇందుకు చనిపోయింది, అందుకు చనిపోయింది అంటూ మాట్లాడటం మంచిది కాదు అని అభిప్రాయపడ్డారు. అనారోగ్య సమస్యలను వల్ల ఆమె మరణిస్తే పోస్టుమార్టం లో కూడా ఆమెది ఆత్మహత్య అని తెలిసినా కూడా రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని నట్టి వాఖ్యణించారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…