Nayanathara -Vignesh: ప్రస్తుతం సోషల్ మీడియా వార్తల్లో ఏదైనా హాట్ టాపిక్ ఉందా అంటే అది నయనతార విగ్నేష్ శివన్ కవల పిల్లల విషయం అని చెప్పాలి.నయనతార విగ్నేష్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉండి ఈ ఏడాది జూన్ నెలలో పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.అయితే పెళ్లయిన నాలుగు నెలలకే ఈ దంపతులు తల్లిదండ్రులు అయ్యారంటూ ఆదివారం పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు.
ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లయిన నాలుగు నెలలకే పిల్లలు పుట్టడం ఏంటి అసలు నయనతార ఎప్పుడు ప్రెగ్నెంట్ అయింది అంటూ కామెంట్ లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే నయనతార విగ్నేష్ సరోగసి ద్వారా పెళ్లికి ముందే పిల్లలను ప్లాన్ చేశారని తెలుస్తోంది.
ఇక ఈ విషయంపై కొందరు తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం చేయగా ఏకంగా తమిళనాడు ప్రభుత్వం వీరిపై ఎంక్వయిరీకి ఆదేశాలు కూడా జారీచేస్తుంది.వీరు సరోగసి ద్వారా పిల్లలను కన్నట్టు ఎక్కడ చెప్పకపోవడంతో పెద్ద ఎత్తున వివాదాలు తలెత్తాయి. అయితే వీళ్ళు కనుక సరోగసి విధానంలో నిబంధనలను పాటించకపోయి ఉంటే తప్పనిసరిగా వీరికి చట్టపరమైన చర్యలు తప్పవంటూ పలువురు భావిస్తున్నారు.
ఇకపోతే సరోగసి ద్వారా పిల్లలను కనడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి వివాహమైన తర్వాత ఐదు సంవత్సరాల వరకు పిల్లలు కలగని నేపథ్యంలో సరోగసి పద్ధతి ద్వారా పిల్లలకు జన్మనివ్వవచ్చు. అలాగే వైద్య పరమైన అనారోగ్య సమస్యలు కనుక ఉంటే ఈ సరోగసి పద్ధతి ద్వారా పిల్లలకు జన్మనివ్వవచ్చు అలా కాకుండా ఈ నిబంధనలను ఉల్లంగించిన వారికి 10 సంవత్సరాలు జైలు శిక్షతోపాటు 10 లక్షల అపరాధం కూడా విధించనున్నారు. మరి నయనతార విషయంలో తప్పు అని తేలితే కనుక వీరికి కూడా ఈ శిక్ష తప్పదా అంటూ కొందరు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.
తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…