Nayanathara – Vignesh Shivan: సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చంద్రముఖి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నయనతార అటు తమిళ్ తెలుగు భాషలలో స్టార్ హీరోల సరసన నటించి తన ఆనందం, అభినయంతో బాగా ఆకట్టుకుంది.కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలలో నటించిన నయనతార ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది.
తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడిన నయనతార ఇటీవల అతన్ని పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. వివాహం జరిగిన దగ్గరినుండి వీరిద్దరూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూ ఉన్నారు. తాజాగా ఈ జంట మరొకసారి వివాదంలో నిలిచింది. సరోగసి పద్ధతి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన నయనతార దంపతులు చట్టానికి విరుద్ధంగా పిల్లలకు జన్మనిచ్చినట్లు వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో నయనతార తన పెళ్లికి సంబంధించిన ఒక పెద్ద ట్విస్ట్ రివిల్ చేసింది.సరోగసి ద్వారా ఏ విధంగా పిల్లల్ని కన్నారనే విషయాలకు సంబంధించి పూర్తి ఆధారాలను విగ్నేష్ నయన్ దంపతులు ప్రభుత్వానికి అందజేసినట్లు సమాచారం. ఈ క్రమంలో వీరిద్దరికి ఆరు సంవత్సరాల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ జరిగిందని ఆధారాలు కూడా సమర్పించినట్లు తెలుస్తోంది. అయితే గతేడాది డిసెంబర్ నెలలో పిల్లల కోసం సరోగసి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు నయన్ విగ్నేష్ దంపతులు ఆధారాలు సమర్పించినట్లు తెలుస్తోంది.
వీరిద్దరూ ఇలా చట్టప్రకారం ఆరు సంవత్సరాల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని దాదాపు ఏడాది క్రితం సరోగసి కోసం రిజిస్టర్ చేసుకున్నట్లు పక్క ఆధారాలు ఉండటంతో వీరు ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా వీరిద్దరూ ఆరు సంవత్సరాల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న విషయం బయటపడటంతో ఇంతకాలం ఈ విషయాన్ని దాచి ఉంచినందుకు అభిమానులు షాక్ లో ఉన్నారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…