Nayanathara – Vignesh Shivan: సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చంద్రముఖి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నయనతార అటు తమిళ్ తెలుగు భాషలలో స్టార్ హీరోల సరసన నటించి తన ఆనందం, అభినయంతో బాగా ఆకట్టుకుంది.కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలలో నటించిన నయనతార ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది.
తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడిన నయనతార ఇటీవల అతన్ని పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. వివాహం జరిగిన దగ్గరినుండి వీరిద్దరూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూ ఉన్నారు. తాజాగా ఈ జంట మరొకసారి వివాదంలో నిలిచింది. సరోగసి పద్ధతి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన నయనతార దంపతులు చట్టానికి విరుద్ధంగా పిల్లలకు జన్మనిచ్చినట్లు వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో నయనతార తన పెళ్లికి సంబంధించిన ఒక పెద్ద ట్విస్ట్ రివిల్ చేసింది.సరోగసి ద్వారా ఏ విధంగా పిల్లల్ని కన్నారనే విషయాలకు సంబంధించి పూర్తి ఆధారాలను విగ్నేష్ నయన్ దంపతులు ప్రభుత్వానికి అందజేసినట్లు సమాచారం. ఈ క్రమంలో వీరిద్దరికి ఆరు సంవత్సరాల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ జరిగిందని ఆధారాలు కూడా సమర్పించినట్లు తెలుస్తోంది. అయితే గతేడాది డిసెంబర్ నెలలో పిల్లల కోసం సరోగసి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు నయన్ విగ్నేష్ దంపతులు ఆధారాలు సమర్పించినట్లు తెలుస్తోంది.
వీరిద్దరూ ఇలా చట్టప్రకారం ఆరు సంవత్సరాల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని దాదాపు ఏడాది క్రితం సరోగసి కోసం రిజిస్టర్ చేసుకున్నట్లు పక్క ఆధారాలు ఉండటంతో వీరు ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా వీరిద్దరూ ఆరు సంవత్సరాల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న విషయం బయటపడటంతో ఇంతకాలం ఈ విషయాన్ని దాచి ఉంచినందుకు అభిమానులు షాక్ లో ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…