Nayanathara: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నయనతార గత ఏడు సంవత్సరాల నుంచి దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమ లో ఉన్నారు. ఈ విధంగా ప్రేమ పక్షులుగా విహరించిన ఈ జంట ఎట్టకేలకు జూన్ 9వ తేదీ మహాబలిపురంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇకపోతే వీరి వివాహానికి పలువురు సినీ ప్రముఖులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
పెళ్లికి ముందు వివిధ క్షేత్రాలను సందర్శించి పెళ్లి చేసుకున్న ఈ జంట పెళ్లి అయిన మరుసటి రోజే తిరుమల శ్రీవారిని ఈ కొత్త జంట దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే నయనతార శుక్రవారం ఉదయం స్వామివారి కల్యాణోత్సవ సేవలో ప్రత్యేక పూజలో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్న అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలతో నూతన జంటను ఆశీర్వదించారు.
ఇక శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం నయనతార మీడియా ముందుకు వచ్చి ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే ఆలయ మాడ వీధులలో నయనతార చెప్పులు వేసుకుని తిరగడం పై పలువురు ఈమె వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత చూపిస్తున్నారు. పవిత్రమైన మాడ వీధులలో నయనతార ఇలా చెప్పులు వేసుకుని తిరగడం ఏంటి అంటూ పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విధంగా నయనతార తిరుమల మాడవీధుల్లో కనిపించడంతో ఒక్కసారిగా మీడియా కూడా తనని చుట్టు ముట్టింది. అయితే కొందరు మీడియా ప్రతినిధులు కూడా చెప్పులు వేసుకుని మాడవీధుల్లో కనిపించడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున నటి నయనతార పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్ర మాడ వీధులలో చెప్పులు వేసుకొని తిరగటంతో ఈ విషయం కాస్తా వివాదంగా మారింది. ఇలా పెళ్లయిన మరుసటిరోజే నయనతార నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారని చెప్పాలి.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…