Nayanathara: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నయనతార గత ఏడు సంవత్సరాల నుంచి దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమ లో ఉన్నారు. ఈ విధంగా ప్రేమ పక్షులుగా విహరించిన ఈ జంట ఎట్టకేలకు జూన్ 9వ తేదీ మహాబలిపురంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇకపోతే వీరి వివాహానికి పలువురు సినీ ప్రముఖులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
పెళ్లికి ముందు వివిధ క్షేత్రాలను సందర్శించి పెళ్లి చేసుకున్న ఈ జంట పెళ్లి అయిన మరుసటి రోజే తిరుమల శ్రీవారిని ఈ కొత్త జంట దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే నయనతార శుక్రవారం ఉదయం స్వామివారి కల్యాణోత్సవ సేవలో ప్రత్యేక పూజలో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్న అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలతో నూతన జంటను ఆశీర్వదించారు.
ఇక శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం నయనతార మీడియా ముందుకు వచ్చి ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే ఆలయ మాడ వీధులలో నయనతార చెప్పులు వేసుకుని తిరగడం పై పలువురు ఈమె వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత చూపిస్తున్నారు. పవిత్రమైన మాడ వీధులలో నయనతార ఇలా చెప్పులు వేసుకుని తిరగడం ఏంటి అంటూ పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విధంగా నయనతార తిరుమల మాడవీధుల్లో కనిపించడంతో ఒక్కసారిగా మీడియా కూడా తనని చుట్టు ముట్టింది. అయితే కొందరు మీడియా ప్రతినిధులు కూడా చెప్పులు వేసుకుని మాడవీధుల్లో కనిపించడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున నటి నయనతార పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్ర మాడ వీధులలో చెప్పులు వేసుకొని తిరగటంతో ఈ విషయం కాస్తా వివాదంగా మారింది. ఇలా పెళ్లయిన మరుసటిరోజే నయనతార నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…