కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా ఉండటంతో ప్రతీ ఒక్కరూ మాస్క్ పెట్టుకొని భౌతిక దూరం పాటించడం అనేది అతడికే కాకుండా అందరికీ మంచిదే. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నామని చెబుతున్నా అది ఎక్కడా కనిపించడం లేదు. పోలీసులు ప్రజలతో స్నేహంగా ఉండాలని అధికారులు చెబుతుంటారు.
కానీ కొందరి పోలీసుల తీరు మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తుంటుంది. రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తిని కట్టే అధికారం ఎవరికీ ఉండదు. అతడు చేసింది నిజంగా తప్పు అయితే చట్ట ప్రకారం శిక్షలు ఉంటాయి.. కానీ ఒకరిపై చెయ్యి చేసుకునే హక్కు ఎవరికీ ఉండదు. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ఎస్ఐ చేసిన నిర్వాకం ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా.? అన్న ప్రశ్నలు తలెత్తేలా చేస్తోంది.
అసలేం జరిగిందంటే.. నెల్లూరు జిల్లా చేజర్ల ఎస్ఐ మహ్మద్ హనీఫ్.. అందూరుపల్లి సెంటర్లో శుక్రవారం రాత్రి వాహనాల తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా ఓ ఆటో డ్రైవర్ మూతికి మాస్క్ ధరించకుండా వెళ్తోన్న వ్యక్తి ఎస్ ఐ చూశాడు. దీంతో కోపంతో ఊగిపోయిన హనీఫ్.. సదరు వ్యక్తిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని కాలితో తన్నాడు.
అంతే కాకుడా.. చొక్కా పట్టుకొని తన్నుతూ కారులోకి తీసుకెళ్లాడు. ఈ తతంగం మొత్తం స్థానికుడు తన మొబైల్ లో చిత్రీకరించాడు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వీడియో వైరల్ అయ్యింది. మాస్క్ ధరించనంత మాత్రాన ఇంతలా దండించాలా.. అయినా దీనిపై పోలీస్ అధికారి స్పందించిన తీరు బాగాలేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వేసవి వేడిని తట్టుకోవడం చాలా మందికి పెద్ద సవాలుగా మారుతోంది. ముఖ్యంగా విద్యుత్ ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో, ఏసీ…
ఫుట్బాల్ ప్రపంచంలో వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపించిన పేరు క్రిస్టియానో రొనాల్డో. నలభై దాటిన తర్వాత కూడా యువ…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో బుద్ధ పౌర్ణిమకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజు బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు జననం,…
భారతదేశంలో అనేక దేవాలయాలు తమ ప్రత్యేక విశేషాలతో భక్తులను ఆకర్షిస్తుంటాయి. వాటిలో కొన్ని ఆలయాలు ఆధ్యాత్మిక శక్తి, విశ్వాసాలు, అద్భుతమైన…
పిల్లలకు పేరు పెట్టడం అనేది ప్రతి తల్లిదండ్రికి ప్రత్యేకమైన అనుభూతి. చాలా మంది ఈ విషయంలో కొత్తదనం, ట్రెండ్, వినూత్నతకు…
నిద్రలో కనిపించే కలలకు మనసుతో పాటు భవిష్యత్తుతో కూడా సంబంధం ఉంటుందని భారతీయ సంప్రదాయాల్లో విశ్వాసం ఉంది. ముఖ్యంగా డబ్బుతో…