ప్రణయ్ హత్య కేసులో నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు నిన్న రాత్రి అనుమాస్పద మృతి చెందిన విషయం తెలిసిందే… అయితే మారుతీరావు మూడురోజుల క్రితమే తన ఆత్మ హత్యకు ప్రణాళిక వేసుకున్నట్టు తెలుస్తుంది. తాజాగా మారుతీరావు అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
మారుతీరావు గత మూడురోజుల క్రితమే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం అయన స్నేహితుడికి సంబంధించిన ఫర్టిలైజర్ షాపు నుంచి పురుగుల మందును మారుతీరావు కొనుగోలు చేసినట్టు సమాచారం. మరో పక్క కూతురు అమృత విషయంలో గత మూడు నెలల నుంచి లాయర్లతో బిజీ బిజీగా మంతనాలు జరిపినట్టు తెలుస్తుంది. కాంప్రమైజ్ అవ్వాలని అమృతకు రాయబారం పంపారట. అమృతను కలవడం కోసం మిర్యాలగూడాకు చెందిన వారితో రాయబారం పంపినట్టు సమాచారం. కానీ అమృత తన మాట వినకపోవడంతో అయన డిప్రషన్లోకి వెళ్లినట్టు సమాచారం.
మరొక పక్క ప్రణయ్ హత్యానంతరం కుటుంబం పరువు పోయిందని మారుతిరావుతో అయన కుటుంబ సభ్యులు తరచూ గొడవలు పడుతున్నారట. ఇంట్లో ఆడపిల్లలకు పెళ్లిళ్లు కావడం లేదని అయన సోదరులు గొడవలు పడినట్టు సమాచారం. ఈ విషయంలో అయన తీవ్ర మనస్తాపం చెందినట్టు సమాచారం.
ప్రణయ్ కేసు ఫైల్స్ తీసుకుని తరచూ హైదరాబాద్ వస్తున్నారు. అదే విధంగా శనివారం అయన ప్రముఖ న్యాయవాదిని కలిసేందుకు హైదరాబాద్ వచ్చారు. శనివారం సాయంత్రం మినప గారెలు తెప్పించుకుని మరి తిన్నారట. రాత్రి 12 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…