గత కొన్ని దశాబ్దాల క్రితం ఇండస్ట్రీలో మురళీమోహన్, జయచిత్రకు ఎంతో క్రేజ్ ఉండేది. వీరిద్దరు జంటగా ఎన్నో సినిమాలలో కలిసి నటించడంతో ఈ జంట ఎంతో పాపులర్ అయ్యిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈ జంట బయట కనిపిస్తే చాలు వీరిపై ఎన్నో పుకార్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎక్కడ చూసిన ఈ జంట కనిపించడంతో వీరిపై అనుమానాలు మరింత బలపడ్డాయి.
షూటింగ్ నిమిత్తం మద్రాసులోని వాహినీ స్టూడియోకి మురళీమోహన్ వెళ్లగానే అక్కడున్న వారందరూ అతనిని చూసి “ఇవర్దా (ఇతనే) మురళీమోహన్” అని అనుకుంటున్నారు.అయితే వాళ్లు అందరూ తన గురించి అలా ఎందుకు అంటున్నారో అర్థం కాక మురళీమోహన్ అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోయారు. ఈ క్రమంలోనే షూటింగ్ నిమిత్తం సెట్లోకి అడుగు పెట్టగానే సహ నటీనటులు మొత్తం నిజం చెప్పు.. నువ్వు జయ చిత్రను పెళ్లి చేసుకుంటున్నావా? అని అడిగారు.. అందుకు మురళీమోహన్ స్పందిస్తూ నేను జయచిత్రను పెళ్లి చేసుకోవడం ఏంటి?నాకు ఇదివరకే పెళ్లయ్యి పిల్లలు కూడా ఉన్నారని సమాధానం చెప్పాడు.
అదే విధంగా మురళీమోహన్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసినటువంటి అట్లూరి పూర్ణచంద్రరావు షూటింగ్ లొకేషన్ కి వచ్చి, “బాబూ నీతో ఓసారి మాట్లాడాలి. బయటకు రా” అని పిలవగానే మురళీమోహన్ ఎందుకో డౌట్ పడుతూ అతని దగ్గరకు వెళ్లారు. ఈ క్రమంలోనే మురళీమోహన్ తో మాట్లాడుతూ ఈ రోజు పేపర్లో వచ్చింది చూసావా.. నువ్వు, జయచిత్ర పెళ్లి చేసుకోబోతున్నారట నిజమేనా? నువ్వు తప్పు చేయవనే నమ్మకం నాకు ఉంది ఒకవేళ తప్పటడుగులు వేస్తున్నవేమో నిన్ను హెచ్చరిద్దామని వచ్చాను.” అన్నారు.
అప్పుడు మురళీమోహన్ అలాంటి తప్పు నేను ఎప్పుడు చేయను.. ఒకరి దగ్గర తలదించుకునే అవకాశాన్ని రానివ్వనని చెప్పడంతో పూర్ణచంద్రరావు ఎంతో సంతృప్తి చెందాడు. ఇలా పేపర్లో ఆ వార్త రావడంతో ఎంతో బాధ పడిన మురళీమోహన్ ఆ వార్త రాసినటువంటి ఎంతో పాపులర్ అయిన దినతంతి అనే డైలీ పేపర్. ఫ్రంట్ పేజీలోనే ప్రముఖంగా ఆ వార్తను వేశారు. దీంతో ఆ దినపత్రికకు మురళీమోహన్ లీగల్ నోటీసులు పంపడంతో సదరు దినపత్రిక ఎలాంటి ఆధారాలు లేకుండా ఆ వార్తలు రాయడం చేత తిరిగి మురళీమోహన్ కు క్షమాపణలు చెప్పింది.
అయితే ఒక రోజు షూటింగ్ నిమిత్తం దాసరి నారాయణరావుతో కలిసి మురళీమోహన్, జయచిత్ర ఓకే ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలోనే మరోసారి అదే దినపత్రిక అప్పుడు మేము చెప్పినది నిజమే.. దాసరి నారాయణ రావు సమక్షంలో మురళీమోహన్, జయచిత్ర పెళ్లి హైదరాబాద్లో జరగనుందని మళ్లీ అదే పేపర్లో వచ్చింది. నిజానికి దాసరి నారాయణరావు అక్కినేని గారికి కథ చెబుదామని హైదరాబాద్ వచ్చారు. మురళీమోహన్ వడ్డే రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కోసం వచ్చారు. అలాగే జయచిత్ర కూడా వేరే సినిమా షూటింగ్ కోసం వచ్చారు.ఈ విధంగా వేరువేరు పనుల నిమిత్తం ఓకే ఫ్లైట్లో ఈ ముగ్గురు రావడం చేత దినతంతి అనే దినపత్రిక మురళీమోహన్ , జయచిత్రకు ఏకంగా పెళ్లి కూడా చేశారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…