Movie News

అప్పట్లో మురళీమోహన్, జయచిత్ర లకు ఒక పాపులర్ దినపత్రిక పెళ్లి చేసిందని మీకు తెలుసా ?!

గత కొన్ని దశాబ్దాల క్రితం ఇండస్ట్రీలో మురళీమోహన్, జయచిత్రకు ఎంతో క్రేజ్ ఉండేది. వీరిద్దరు జంటగా ఎన్నో సినిమాలలో కలిసి నటించడంతో ఈ జంట ఎంతో పాపులర్ అయ్యిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈ జంట బయట కనిపిస్తే చాలు వీరిపై ఎన్నో పుకార్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎక్కడ చూసిన ఈ జంట కనిపించడంతో వీరిపై అనుమానాలు మరింత బలపడ్డాయి.

షూటింగ్ నిమిత్తం మద్రాసులోని వాహినీ స్టూడియోకి మురళీమోహన్ వెళ్లగానే అక్కడున్న వారందరూ అతనిని చూసి “ఇవ‌ర్‌దా (ఇత‌నే) మురళీమోహన్” అని అనుకుంటున్నారు.అయితే వాళ్లు అందరూ తన గురించి అలా ఎందుకు అంటున్నారో అర్థం కాక మురళీమోహన్ అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోయారు. ఈ క్రమంలోనే షూటింగ్ నిమిత్తం సెట్లోకి అడుగు పెట్టగానే సహ నటీనటులు మొత్తం నిజం చెప్పు.. నువ్వు జయ చిత్రను పెళ్లి చేసుకుంటున్నావా? అని అడిగారు.. అందుకు మురళీమోహన్ స్పందిస్తూ నేను జయచిత్రను పెళ్లి చేసుకోవడం ఏంటి?నాకు ఇదివరకే పెళ్లయ్యి పిల్లలు కూడా ఉన్నారని సమాధానం చెప్పాడు.

అదే విధంగా మురళీమోహన్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసినటువంటి అట్లూరి పూర్ణ‌చంద్ర‌రావు షూటింగ్ లొకేషన్ కి వచ్చి, “బాబూ నీతో ఓసారి మాట్లాడాలి. బ‌య‌ట‌కు రా” అని పిలవగానే మురళీమోహన్ ఎందుకో డౌట్ పడుతూ అతని దగ్గరకు వెళ్లారు. ఈ క్రమంలోనే మురళీమోహన్ తో మాట్లాడుతూ ఈ రోజు పేపర్లో వచ్చింది చూసావా.. నువ్వు, జయచిత్ర పెళ్లి చేసుకోబోతున్నారట నిజమేనా? నువ్వు తప్పు చేయవనే నమ్మకం నాకు ఉంది ఒకవేళ తప్పటడుగులు వేస్తున్నవేమో నిన్ను హెచ్చ‌రిద్దామ‌ని వ‌చ్చాను.” అన్నారు.

అప్పుడు మురళీమోహన్ అలాంటి తప్పు నేను ఎప్పుడు చేయను.. ఒకరి దగ్గర తలదించుకునే అవకాశాన్ని రానివ్వనని చెప్పడంతో పూర్ణచంద్రరావు ఎంతో సంతృప్తి చెందాడు. ఇలా పేపర్లో ఆ వార్త రావడంతో ఎంతో బాధ పడిన మురళీమోహన్ ఆ వార్త రాసినటువంటి ఎంతో పాపులర్ అయిన దిన‌తంతి అనే డైలీ పేప‌ర్‌. ఫ్రంట్ పేజీలోనే ప్ర‌ముఖంగా ఆ వార్త‌ను వేశారు. దీంతో ఆ దినపత్రికకు మురళీమోహన్ లీగల్ నోటీసులు పంపడంతో సదరు దినపత్రిక ఎలాంటి ఆధారాలు లేకుండా ఆ వార్తలు రాయడం చేత తిరిగి మురళీమోహన్ కు క్షమాపణలు చెప్పింది.

అయితే ఒక రోజు షూటింగ్ నిమిత్తం దాసరి నారాయణరావుతో కలిసి మురళీమోహన్, జయచిత్ర ఓకే ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలోనే మరోసారి అదే దినపత్రిక అప్పుడు మేము చెప్పినది నిజమే.. దాసరి నారాయణ రావు సమక్షంలో మురళీమోహన్, జయచిత్ర పెళ్లి హైదరాబాద్లో జరగనుందని మళ్లీ అదే పేపర్లో వచ్చింది. నిజానికి దాసరి నారాయణరావు అక్కినేని గారికి కథ చెబుదామని హైదరాబాద్ వచ్చారు. మురళీమోహన్ వడ్డే రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కోసం వచ్చారు. అలాగే జయచిత్ర కూడా వేరే సినిమా షూటింగ్ కోసం వచ్చారు.ఈ విధంగా వేరువేరు పనుల నిమిత్తం ఓకే ఫ్లైట్లో ఈ ముగ్గురు రావడం చేత దిన‌తంతి అనే దినపత్రిక మురళీమోహన్ , జయచిత్రకు ఏకంగా పెళ్లి కూడా చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

విదేశీ ఉద్యోగం అంటూ వల.. యువత మోసపోయిన కథ

విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…

1 hour ago

బుక్ చేసినా రాని సిలిండర్లు.. చివరకు బలవంతంగా తీసుకెళ్లిన ప్రజలు

మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…

2 hours ago

మోదీకి రేవంత్ లేఖ.. నియోజకవర్గాల పెంపుపై కీలక డిమాండ్లు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…

2 hours ago

“ఆమె నాకు కూతురు లాంటిది”.. హీరోయిన్‌కు నో చెప్పిన వేణు..!

సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…

2 hours ago

వాష్‌రూమ్‌కు వెళ్లి మాయమైన ఖైదీ.. పోలీసులకు షాక్!

హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…

3 hours ago

కొన్ని తేదీల్లో గరుడ సేవ రద్దు.. కారణాలు వెల్లడించిన ఆలయ అధికారులు!

తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…

4 hours ago