Nidhi Aggarwal: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన ఇండస్ట్రీకి చెందినటువంటి సెలబ్రిటీల జాతకాలను చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఈయన చెప్పిన విషయాలు నిజం కావడంతో ఈయన చేసే వ్యాఖ్యలను నమ్మే వారి సంఖ్య రోజుకు పెరుగుతుంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి చెందినటువంటి సెలబ్రిటీలు ఇండస్ట్రీలో సక్సెస్ అవడం కోసం ఈయన చేత ప్రత్యేకంగా పూజలు చేయించుకుంటున్నారు.
ఇదివరకే నటి రష్మిక మందన్న వేణు స్వామితో తన ఇంట్లో ప్రత్యేక పూజలు చేయించడంతో తనకు ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తున్నాయని తెలియజేశారు. అయితే తాజాగా మరొక నటి నిధి అగర్వాల్ సైతం వేణు స్వామి చేత ఇంట్లో రాజా శ్యామల పూజ చేయించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది.
వేణు స్వామి బృందం సమక్షంలో నిధి అగర్వాల్ ప్రత్యేకంగా పూజలు చేశారు.అయితే ఈమె జాతకంలో ఏదైనా దోషాలు ఉన్న కారణంగా ఇలాంటి పూజలు చేశారా లేకపోతే ఇండస్ట్రీలో మంచి అవకాశాలను అందుకొని సక్సెస్ సాధించడం కోసం పూజలు చేశారా అనే విషయం తెలియదు కానీ ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇక నిధి అగర్వాల్ నాగార్జున నటించిన సవ్యసాచి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ తదుపరి చిత్రం పూరి జగన్నాథ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఇటు తెలుగులోను తమిళంలో కూడా సినిమాలు చేశారు. అయితే ప్రస్తుతం ఈమెకు అవకాశాలు లేకపోవడంతో ఇలా పూజలు చేయించారని పలువురు భావిస్తున్నారు.
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…
సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…
హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…