Niharika : కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈమధ్యే మళ్ళీ సోషల్ మీడియాలో రీ ఎంట్రీ ఇచ్చింది. జిమ్ వీడియోతో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను డిలీట్ చేసిన నిహారిక, ఆ తరువాత పబ్ లో పోలీసుల దాడి లో దొరికి వార్తల్లో నానింది. ఇక పబ్ ఉదంతంలో డ్రగ్స్ పట్టుబడడంతో ఇంకాస్త నెగెటివ్ ప్రచారం నిహారికపై వచ్చింది. ఈ సంఘటనల అనంతరం నిహారిక బయట కనిపించలేదు. ఇక నాగబాబును పొలిటికల్ గా బాగా విమర్శించారు. కూతురికి పద్దతి నేర్పించమంటూ ఘాటుగా కామెంట్స్ చేసారు శ్రీ రెడ్డి వంటి వారు.
మా బావగారు ఉండగా మాకేం భయం లేదు….
ఇటీవల మళ్ళీ సోషల్ మీడియాలో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన నిహారిక భర్తతో కలిసి విహార యాత్రలకు విదేశాలకు వెళ్లి అక్కడ ఫోటోలను షేర్ చేస్తూ హల్ చల్ చేసింది. రీసెంట్ గా మదర్స్ డే నాడు తన తల్లితో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు నిహారిక. పద్మజ గారిని నిహారిక పై వచ్చిన నెగెటివిటీపై ఎలా ఫీలయ్యారు అని అడుగగా మొదట్లో కొద్దిగా బాధేసిన తప్పు చేయనప్పుడు ఎందుకు బాధపడాలి అని అనుకున్నట్లు తెలిపారు. ఇక ఏ విషయంలోనూ భయపడే అవసరమూ మాకు లేదని మా బావగారు మాకు అండగా ఉండగా దేని గురించి ఆలోచించమంటూ పద్మజ గార పేర్కొన్నారు.
ఇక నిహారిక పై వచ్చిన నెగెటివిటీ గురించి నిహారిక మాట్లాడుతూ అసలు సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి కామెంట్స్ అసలు చూడనని, న్యూస్ వంటివి టీవిలో చూడనని, యూట్యూబ్ థంబ్ నైల్స్ వంటివి అసలు పట్టించుకోనని ఇక నాపై వచ్చే నెగెటివ్ కామెట్స్ అసలు పట్టించుకోనని నాకసలు అవి ఫరక్ పడవంటూ తెల్చేసింది. నా ముందు వచ్చి నా గురించి మాట్లాడారు కదా ఒకవేళ మాట్లాడితే కొట్టేస్తా కదా అంటూ సరదాగా చెప్పింది నిహారిక.
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…
ఉదయం నిద్రలేవగానే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. రాత్రి తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవడం, తగినంత…
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…