No one believed me except Pawan Kalyan..: Shruti Haasan
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా శృతి హాసన్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ చిత్ర పరిశ్రమల్లో తక్కువ సమయంలోనే ఆమె తనదైన ముద్ర వేసింది. స్టార్ హీరోలందరితో కూడా తక్కువ కాలంలోనే కలిసి నటించిన నటీమణిగా శృతి గుర్తింపు పొందింది. అయితే ఈ ప్రయాణం అంత సులభంగా సాగలేదని, ఆమె తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న అనుభవాలను షేర్ చేసింది.
శృతి హాసన్ తెలిపిన వివరాల ప్రకారం, నటీమణుల మొదటి సినిమాలు ఫెయిల్ అయితే వెంటనే వారికి “ఐరన్ లెగ్” అనే దారుణమైన ట్యాగ్ అంటించడమో, సినిమా ఫలితానికి వారిని బాధ్యుల్ని చేయడమో టాలీవుడ్లో సాధారణమైపోయింది. అదే సమయంలో హీరోల విషయంలో మాత్రం అలాంటి విమర్శలు పెద్దగా ఎదురవ్వవు. ఈ విధమైన భేదభావాన్ని తాను కూడా మొదట్లోనే తట్టుకున్నానని ఆమె వెల్లడించారు.
“నాపై నమ్మకంతో ‘గబ్బర్ సింగ్’ సినిమాలో అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, హరీష్ శంకర్ గారికి ఎప్పటికీ కృతజ్ఞతలు. వాళ్లు నన్ను నమ్మకంగా తీసుకున్నారు. నేను అదృష్టవంతురాలినో, లేక దురదృష్టవంతురాలినో అన్న పదాలు నాకిష్టం ఉండవు. నటనంటే ప్రేమ. అదే నన్ను ఇంతవరకూ తీసుకొచ్చింది” అని శృతి హాసన్ తెలిపారు.
తన డెబ్యూ మూవీ ‘3’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోయినా, “కొలవెరి డి” పాట మాత్రం సంచలనంగా మారిందని చెప్పింది. “ఈ రోజు ఓటీటీ, పాన్ ఇండియా ట్రెండ్లలో ‘3’ సినిమా వచ్చి ఉంటే, అది పెద్ద హిట్ అయ్యేదన్న నమ్మకం నాకు ఉంది” అని చెప్పింది.
ప్రస్తుతం శృతి హాసన్ సూపర్ స్టార్ రజనీకాంత్తో కలిసి ‘కూలీ’ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె “ప్రీతి” అనే పాత్రలో కనిపించనుంది. “ఒక మ్యూజిక్ వీడియో పనిలో ఉన్నపుడు దర్శకుడు లోకేష్ కనగరాజ్ కథ చెప్పాడు. స్క్రిప్ట్ విన్న వెంటనే నాకిష్టమైంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు సత్యరాజ్ కుమార్తె పాత్రలో నటిస్తున్నాను. ఇది నా కెరీర్లో చాలా ప్రత్యేకమైన పాత్ర” అంటూ శృతి హాసన్ తన తాజా ప్రాజెక్ట్ గురించి వివరించింది.
సినీ రంగంలో సాధారణంగా ఒక హీరో, కొన్ని ఎంపిక చేసిన హీరోయిన్లతోనే ఎక్కువ సినిమాలు చేస్తుంటారు. ముఖ్యంగా గత కాలంలో…
దక్షిణ భారతీయుల రోజువారీ ఆహారంలో ఇడ్లీ, దోశలకు ప్రత్యేక స్థానం ఉంది. వేగవంతమైన జీవనశైలిలో సమయం ఆదా కోసం చాలామంది…
మధుమేహం (డయాబెటిస్) వల్ల వచ్చే సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలంగా షుగర్ నియంత్రణలో లేకపోతే నరాలపై ప్రభావం పడే…
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…