Political News

“కవిత లిక్కర్ స్కామ్‌ విచారణ ఆపితే BRS ను బీజేపీలో కలిపేస్తామన్నారు..” కేటీఆర్‌పై సీఎం రమేష్ సంచలన ఆరోపణ !

అనకాపల్లి: ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తాజాగా తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో తనపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ, కేటీఆర్‌కు ఎదురుదాడి చేశారు. శనివారం అనకాపల్లిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

BRS will be merged with BJP.” CM Ramesh’s sensational allegation against KTR!

బీఆర్ఎస్-బీజేపీ విలీనం, లిక్కర్ స్కామ్ పై ఆరోపణలు

ముఖ్యంగా, బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసేందుకు చర్చలు జరిగినప్పుడు కేటీఆర్‌నే ముందుగా అభ్యర్థించారని సీఎం రమేష్ తెలిపారు. “కవితపై లిక్కర్ స్కామ్ విచారణ ఆపితే బీఆర్ఎస్‌ను బీజేపీలో కలుపుతామని చెప్పిన వాడే కేటీఆర్. మా ఇంటికొచ్చి ఇదంతా మాట్లాడిన విషయం మర్చిపోయారా?” అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కోరిక మేరకే బీజేపీ పెద్దలతో తాను మాట్లాడిన విషయాన్ని వెల్లడించారు. అయితే, ఆ సమయంలోనే బీజేపీ నేతలు బీఆర్ఎస్ ఇప్పటికే ముగిసిపోయిన పార్టీ అని తేల్చేసినట్టు చెప్పారు. ఇదంతా నిజం కాదని కేటీఆర్ ధైర్యంగా గుండె మీద చెయ్యిపెట్టి చెప్పగలరా? అని సవాల్ విసిరారు.

అంతేకాక, గతంలో టీడీపీతో కేటీఆర్ పెట్టుకున్న పొత్తు కారణంగానే సిరిసిల్ల నియోజకవర్గంలో కేవలం 300 ఓట్ల మెజారిటీతో గెలిచిన విషయం గురించి కూడా వివరణ ఇవ్వాలంటూ నిలదీశారు.

రిత్విక్ కంపెనీ కాంట్రాక్ట్ ఆరోపణలు, సీఎం రమేష్ వివరణ

ఇక తనపై వచ్చిన రిత్విక్ కంపెనీ కాంట్రాక్ట్ ఆరోపణలపై స్పందిస్తూ, సీఎం రమేష్ వాటిని పూర్తిగా తిప్పికొట్టారు. “రిత్విక్ కంపెనీకి రూ.1660 కోట్ల విలువైన కాంట్రాక్టులు అప్పగించినప్పుడు నన్ను లింక్ చేయడమే నాసమర్థత. నాకు ఆ కంపెనీతో ఎలాంటి సంబంధం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కాంట్రాక్టులు దక్కించుకున్నానని కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు అవాస్తవం. మంత్రిగా పదేళ్లు పనిచేసిన ఆయనకు ప్రభుత్వ కాంట్రాక్ట్ విధానాలు తెలియవా?” అని ప్రశ్నించారు. తనపై నిందలు మోపడం మూర్ఖత్వం అని పేర్కొన్నారు.

కేటీఆర్‌కు హెచ్చరిక, బీఆర్ఎస్ పాలనపై ఆరోపణలు

ఈ వివాదం మరింత ఉత్కంఠ రేపేలా సీఎం రమేష్ హెచ్చరికలు కూడా చేశారు. “కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. అవసరం వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అనేక అవకతవకల గురించి బయటపెడతా. పదేళ్ల పాలనలో 7 లక్షల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు. వాటిలో ఎవరెవరికి కాంట్రాక్టులు వెళ్లాయో, ఏపీ నుంచి ఎన్ని కంపెనీలు ఉన్నాయో నాకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి” అని పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో పాత కక్షలు మళ్లీ ముదురుతుండగా, కేంద్ర-రాష్ట్ర రాజకీయాల మధ్య తీవ్ర విమర్శలు, సవాళ్లకు వేదిక అయ్యే అవకాశం కనిపిస్తోంది.

telugudesk

Recent Posts

విదేశీ ఉద్యోగం అంటూ వల.. యువత మోసపోయిన కథ

విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…

9 hours ago

బుక్ చేసినా రాని సిలిండర్లు.. చివరకు బలవంతంగా తీసుకెళ్లిన ప్రజలు

మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…

9 hours ago

మోదీకి రేవంత్ లేఖ.. నియోజకవర్గాల పెంపుపై కీలక డిమాండ్లు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…

9 hours ago

“ఆమె నాకు కూతురు లాంటిది”.. హీరోయిన్‌కు నో చెప్పిన వేణు..!

సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…

10 hours ago

వాష్‌రూమ్‌కు వెళ్లి మాయమైన ఖైదీ.. పోలీసులకు షాక్!

హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…

10 hours ago

కొన్ని తేదీల్లో గరుడ సేవ రద్దు.. కారణాలు వెల్లడించిన ఆలయ అధికారులు!

తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…

11 hours ago