అన్నింటిలో ఆడపిల్లలు సమానం అని కొందరు అంటుంటే.. మరికొందరు ఆడపిల్లలను పాఠశాలకు పంపడానికి కూడా వెనకాడుతున్నారు. అలాంటి ఆడపిల్లలకు తోడుగా ఎంతోమంది మహిళలు పోరాటం చేశారు.. ఇంకా చేస్తున్నారు. ఇలా పోరాటం చేసిన వారిలో మలాలా ఒకరు. పాకిస్తాన్ లోని స్వాత్ లోయలో జన్మించిన మలాలా.. బాలిక విద్య కోసం, ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తారు.
దీంతో 2012లో తాలిబాన్లు మలాలా చదువుతున్న పాఠశాల బస్సులోకి చొరబడి ఆమె మీద కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఆమెకు తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం ఆమెను పెషావర్ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాణాలను కాపాడారు వైద్యలు. తర్వాత పలు ఆపరేషన్ల తర్వాత మలాలా కోలుకున్నారు. ఆ రోజు నుంచి ఆమె బ్రిటన్ లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు.
ఆడపిల్లల చదువు కోసం మలాలా చేసిన సేవల్ని గుర్తించి 2014లో ఆమెకు నోబెల్ శాంతి బహుమతి పురస్కారాన్ని అందజేశారు. నోబెల్ బహుమతి స్వీకరించిన అతి పిన్న వయస్సురాలిగా మాలాలా గుర్తింపు కూడా పొందారు. తాజాగా మాలాల సరికొత్త జీవితాన్ని ప్రారంభించారు. అసర్ మాలిక్ అనే యువకుడితో వివాహ వేడుక నిరాడంబరంగా జరిగింది. బర్మింగ్హామ్లోని తన ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో మాలిక్ను ఆమె నిఖా చేసుకున్నారు.
ఈ వేడుక ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ”ఈ రోజు నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది. అస్సర్, నేను జీవిత భాగస్వాములు అయ్యాం. బర్మింగ్హమ్లోని మా ఇంట్లో ఇరు కుటుంబాల సమక్షంలో నిరాడంబరంగా నిఖా వేడుకను నిర్వహించాం. మీ ఆశీస్సులు మాకు పంపించండి. భార్యభర్తలుగా కొత్త ప్రయాణం కలిసి సాగించడానికి సంతోషంగా ఉన్నాం” అని మలాలా ట్వీట్ చేసి తన పెళ్లి ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…